తల్లి మోసం చేశావు.. సోనియాతో జేసి..!
ఎప్పడూ విచిత్రంగా మాట్లాడే జేసి దివాకర్ రెడ్డి పార్లమెంట్ లో సోనియా ఒక్క సారిగా ఎదురు పడటం తో కొన్ని ఆసక్తి కరమైన సంభాషణలు సాగినాయి. ఈ సందర్భంలో జేసీ సోనియా గాంధీతో కీలక వ్యాఖ్యలు చేశారు. "తల్లీ రాష్ట్రాన్ని విభజించావ్.. రెడ్లకు తీరని అన్యాయం చేశావ్.. కాంగ్రెస్ను నమ్ముకొని తెలుగు రాష్ట్రాల్లో రెడ్లు నిలువునా మునిగారు'' అంటూ సోనియాకు జేసీ దండం పెట్టారు.
అనంతపురం గ్రూపు రాజకీయాల వల్లే జేసీ టీడీపీ హైకమాండ్కు ఝలక్ ఇచ్చినట్లు సమాచారం. అయితే అవిశ్వాసం ఓటింగ్ తర్వాత ఏం జరుగుతుందో చూడండంటూ జేసీ సస్పెన్స్ మిగిల్చారు. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరే ప్రార్థనామందిరాల కమిటీలను కోర్టుకు పంపించారని ఆరోపిస్తున్న జేసీ దివాకర్రెడ్డి అలకపాన్పు ఎక్కారు. అంతేకాదు ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని సన్నిహితులకు చెప్పారు. దీంతో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని చంద్రబాబు అమరావతికి పిలిపించుకొని మాట్లాడారు. జేసీతో మనస్పర్థలు ఉంటే సర్దుకుపోవాలని చెప్పారు. అంతేకాదు.. జేసీ కోరుతున్నట్లు అనంతపురంలో రహదారుల విస్తరణకు ప్రభుత్వం వెంటనే జీవో ఇచ్చింది. దీంతో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అలక వీడినట్టు సమాచారం.