కల్యాణితో ఆ స్వామీజీకి ఏంటి గొడవ..!?

Vasishta

ఒకరి మనోభావాలను దెబ్బతీయనంతవరకు ఎటువంటి కార్యక్రమాలనైన టీవీ చానళ్ళు  ప్రసారం చేసుకోవచ్చు. కానీ వ్యక్తుల అనుమతి లేకుండా వారికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు ప్రసారం చేసి వారి గౌరవాన్ని భంగం కలగకుండా చూడాల్సి ఉంటుంది. కాని ఓ ఆధ్యాత్మిక ఛానల్ ఓ మహిళ వ్యక్తిగత విషయాలు ప్రసారం చేసి వార్తల్లో నిలిచింది.     


టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి పేరు తెలియని వారుండరు. తనను కించపరిచేలా ఇటీవల ఓ ఆధ్యాత్మిక ఛానల్ న్యూస్ ప్రసారం చేసిదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సంబధించిన వ్యక్తిగత విషయాలు తన అనుమతి లేకుండా ప్రసారం చేయటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రమణానంద మహర్షికి చెందిన భక్తి ఛానెల్ లో తనను అవమానపరిచేలా వార్తలను ప్రసారం చేశారని అమె దుయ్యబట్టారు. దేవతలపై హరికథ కార్యక్రమాలు చేసే తనపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు. హిందూధర్మం అనుసరించే తనపై ఇటువంటి తప్పుడు ప్రసారాలు చేయడం సరికాదన్నారు.


మహర్షి.. భక్తి ముసుగులో డబ్బులు కూడబెడుతున్నారని కళ్యాణి ఆరోపించారు. గతంలో దేవతలను కించపరిచే విధంగా ఆయన మాట్లాడటాన్ని ప్రశ్నించినందువల్లే టర్గెట్ చేసి తనసై అసత్య వార్తలు ప్రసారం చేస్తున్నారని తెలిపారు. వందల ఎకరాల్లో ఆశ్రమాన్ని కట్టిన మహర్షి ఉచితంగా యాగాలు ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. తనకు సంబంధించి కోర్టులో ఉన్న విషయాలను సైతం బహిర్గతం చేసిన ఛానల్ పై చర్యలు తీసుకోవాలంటూ కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: