ఎమ్మెల్సీ ఎలక్షన్స్.. హస్తానికి కమలం సోపర్ట్..?
అందువల్లే కాంగ్రెస్కు అక్కడ ఎక్కువగా ఓట్లు పడలేదు. అలాగే ఈటల మంచి మెజారిటీతో గెలుపొందారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ప్రయత్నించి 20 నుంచి 30 వేల ఓట్లు తెచ్చుకుంటే పరిస్థితి ఏ విధంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అంటే పరోక్షంగా అక్కడ బీజేపీకి కాంగ్రెస్ లోపాయికారిగా సహకరించిందని అంటున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయినట్టు కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో కాషాయ పార్టీ పోటీలో నిలబడలేదు. కానీ, కాంగ్రెస్ మాత్రం కొన్ని చోట్ల పోటీలోకి దిగింది. అయితే, కాంగ్రెస్కు పూర్తిస్థాయిలో బలం లేదు.
స్వతంత్ర అభ్యర్థులు, క్రాస్ ఓటింగ్పైనే ఆశలు పెట్టుకుంది. దీంతో పాటు స్థానికంగా ఉండే బీజేపీ నేతలను ఒప్పించి వారికి ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్లు తమకు వేయించుకునేలా చూస్తున్నారని తెలుస్తోంది. మెదక్ స్థానంలో జగ్గారెడ్డి భార్య నిర్మల పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్కు బలం తక్కువగానే ఉంది. కానీ.. బీజేపీ, ఇండిపెండెంట్ల సపోర్ట్ తీసుకుంటే టీఆర్ఎస్ కు గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎలాగో హుజురాబాద్లో సహకరించాం కదా.. ఇక్కడ మాకు సపోర్ట్ చేయండంటూ బీజేపీ నేతలతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం.