కొడాలి నాని ఎందుకు సైలెంట్ అయ్యారు.. ఏం జ‌రిగింది ?

VUYYURU SUBHASH
ఏపీ ప్రభుత్వంలో పేరుకు మాత్రమే 25 మంది మంత్రులు ఉన్నా.. వారిలో ధైర్యం గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే మంత్రులు ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారు. జగన్ క్యాబినెట్ లో ఎంత మంది మంత్రులు ఉన్నా వారిలో ?  ఫైర్బ్రాండ్ కొడాలి నాని పెట్టే ప్రెస్ మీట్ల‌కు మాత్రమే అదిరిపోయే రెస్పాన్స్ ఉంటుంది. ఏ విషయంలో అయినా సజ్జల రామకృష్ణారెడ్డి లేదా మరో మంత్రి ప్రెస్‌మీట్ పెట్టి ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తే పెద్దగా కిక్‌ ఉండదు. అదే కొడాలి నాని ప్రెస్‌మీట్‌ పెడితే వచ్చే రెస్పాన్స్ వేరుగా ఉంటుంది. గత కొంతకాలంగా ఆయ‌న‌ సైలెంట్గా ఉంటున్నారని వైసిపి వర్గాల్లోనే చర్చలు నడుస్తున్నాయి. దేవినేని ఉమా పేరు చెబితే కొడాలి నాని ఎలా ? ఒంటికాలితో లేస్తారో తెలిసిందే. అలాంటి దేవినేని ఉమ అరెస్టు అనంతరం కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టి తన శైలికి భిన్నంగా 20 నిమిషాల్లోనే క్లోజ్ చేసారు.
అప్పటినుంచే నాని వ్యవహారశైలి ఏదో తేడా కొడుతుంది అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఇక ఏపీ అప్పుల విష‌యంలో ప్రతిపక్షాలు ఇంత రాద్ధాంతం చేస్తున్న కూడా కొడాలి నాని బయటకు రావడం లేదు. టిడిపి - చంద్రబాబు - లోకేష్ ను కడిగి పడడంలో కొడాలి నాని తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. స‌రే మిగిలిన మంత్రులు ఎప్పుడూ మాట్లాడ‌రు. అస‌లు చాలా మంది మంత్రులో కాదో ?  కూడా తెలియ‌దు. కానీ ఎప్పుడూ ప్ర‌భుత్వానికి వ‌త్తాసు ప‌లుకుతూ విప‌క్షాల‌ను ఏకడంలో ముందుండే నానికి ఏమైంద‌న్న‌ది మాత్రం అంతు ప‌ట్ట‌డం లేదు.
ఇక జ‌ల‌వివాదం విష‌యంలోనూ నాని త‌న స్థాయికి త‌గిన విమ‌ర్శ‌లు, కౌంట‌ర్లు ఇవ్వ‌డం లేద‌న్న టాక్ అయితే ఉంది. ఇక ఇప్పుడు స‌జ్జ‌ల ఒక్క‌రే కాస్తో కూస్తో విప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను తిప్పికొడుతున్నారు. స‌జ్జ‌లో, బొత్సో మాట్లాడితే  అది చాలా లైట్‌గా ఉంటుంది. కొడాలి మాస్ పంచ్ ప‌డితేనే ఆ కిక్ వేరుగా ఉంటుంది. త్వ‌ర‌లో మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న నేప‌థ్యంలో నానిని త‌ప్పించి అదే కులానికి చెందిన మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తార‌న్న ఓ టాక్ ఉంది. ఈ నేప‌థ్యంలోనే నాని సైలెంట్ అయ్యారా ? అన్న‌ది ఓ సందేహంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: