వార్ని.. ఆ ఇళ్ళు అమ్మేస్తున్నారు?

praveen
ప్రశాంతంగా జీవించాలని అందరూ కోరుకుంటారు. కాని నేటి రోజులలో ప్రశాంతత ఎక్కడ ఉంది. ముఖ్యంగా నగరాల్లో జీవించే వారికి అయితే ఎప్పుడూ చుట్టూ చుట్టూ వాహనాల శబ్దం.. కాలుష్యం.. ఒక విచిత్రమైన మనుషులు కనిపిస్తూ ఉంటారు. దీంతో ఎంతో మంది ప్రశాంతంగా జీవించాలని అనుకున్న వారికి ఆ కోరిక కేవలం కలగానే మిగిలిపోతుంది. ఈ క్రమంలోనే  నగరాల్లో జీవనం సాగించే వారు కొన్ని కొన్ని సార్లు ప్రశాంతత కోసం గ్రామాలు పల్లెలకు వెళ్తూ అక్కడ పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో అటు గ్రామాల్లో కూడా ప్రశాంతత కరువైంది అనే చెప్పాలి. మరికొంత మంది అటు మనుషులకు కూడా దూరంగా మరింత ప్రశాంతంగా ఉంటే ఎంత బాగుండు అని కోరుకుంటూ ఉంటారు.

 ఇక ఇప్పుడు ఇలా అనుకునే వారి కోసమే ఒక ఇల్లు సిద్ధంగా ఉంది. ఒకసారి ఆ ఇంట్లోకి వెళ్ళారు అంటే చాలు ఇక లోకంతో సంబంధం ఉండదు.  కనీసం మనిషి కూడా కనుచూపు మేరలో కనిపించడు. ఎలాంటి రణగొణ ధ్వనులు కూడా వినిపించవు. కలలో కూడా ఊహించనంత ప్రశాంతత ఆ భవనంలో ఉంటుంది. ఇంతలా చెబుతున్నారు ఆ ఇల్లు భూమి మీద కాకుండా అంతరిక్షంలో ఉందా ఏంటి అని అనుకుంటున్నారా.. అంతరిక్షంలో కాదు ఎవరి కనుచూపు మేరలో కనిపించని సముద్రం మధ్యలో ఉంది. సముద్రం మధ్యలో ఉన్న ఒక ఇల్లు ని ప్రస్తుతం అమ్మకానికి సిద్ధంగా పెట్టారు.

 ఆ ఇంటి పేరు స్ఫక్ బాక్ పోర్ట్. ఇది లండన్ కు దాదాపు 125 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో నిర్మించారు. 1875 కాలంలో ఓడల రక్షణ కోసం ఈ భవనాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది.. ఇక ఎంతో సుందరంగా కనిపించే ఇంట్లో చిన్న లైట్ హౌస్ తో పాటు 9 బెడ్ రూమ్ లు కూడా ఉంటాయి. ఇక ఎంతో హాయిగా సినిమాలు చూసేందుకు ఒక రూమ్ కూడా ఉంటుంది. చిన్న వైన్ రూమ్ తో పాటు.. వేడి నీటి కోసం ఒక రూమ్ కూడా ఉంటుందట. ఇక ప్రస్తుతం ఈ భవనాన్ని అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తుంది. దీని ధర ఏకంగా  40 కోట్ల ఉంటుందట. ఇక ఒంటరిగా ప్రపంచానికి దూరంగా ముఖ్యంగా మనుషులే కనిపించని చోట నివసించాలి అనుకునేవారికి ఈ ఇల్లు ఎంతగానో నచ్చుతుంది అని చెప్పాలి. కానీ ఇల్లు సముద్రం లో ఉంది కాబట్టి కాస్త డేంజరే అని అంటున్నారు మరికొంతమంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: