సూపర్ ఓవర్ విక్టరీ తర్వాత సూపర్ యాటిట్యూడ్ – థరూర్ మాస్ మూవ్ వైరల్..!
ప్రారంభంలో బీజేపీ అభ్యర్థి భారీ ఆధిక్యంలో ఉన్నా, చివరి రౌండ్ల కౌంటింగ్లో థరూర్ దాన్ని తిప్పికొట్టి, స్వల్ప తేడాతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. ఈ క్లిఫ్ హ్యాంగర్ విక్టరీ తర్వాత, థరూర్ చూపించిన క్రీడాస్ఫూర్తి అద్భుతం. ఆయన మీడియాతో మాట్లాడుతూ... "ఇది చాలా టఫ్ ఫైట్. నా ప్రత్యర్థులు రాజీవ్ చంద్రశేఖర్, పన్నీరంద్రన్ (సీపీఐ) ఇద్దరూ చాలా శక్తివంతమైన పోటీ ఇచ్చారు. ముఖ్యంగా, బీజేపీ తిరువనంతపురంపై చాలా గట్టిగా దృష్టి పెట్టింది. జాతీయ స్థాయి నాయకులు, పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి మరీ ప్రచారం చేశారు. వారి కష్టాన్ని, పోరాటాన్ని నేను అభినందించాలి" అని పేర్కొన్నారు. శశి థరూర్ కేవలం మాటలతో సరిపెట్టకుండా, తన గెలుపు సందర్భంగా ఏర్పాటు చేసిన స్వీట్ ప్యాకెట్లను తీసుకెళ్లి, బీజేపీ కార్యకర్తలకు అందించారు.
ఇదొక అసాధారణ సన్నివేశం. సాధారణంగా, ఎన్నికల తర్వాత ప్రత్యర్థుల మధ్య ఉద్రిక్త వాతావరణం ఉంటుంది. కానీ, థరూర్ ఆ గెలుపు ఉత్సాహంలోనూ రాజకీయ 'క్లాస్'ను చూపించి, అందరి మనసులూ గెలుచుకున్నారు. "బీజేపీ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ ఈ విజయాన్ని ఇంత కఠినతరం చేశారు. వారి పోరాట స్ఫూర్తిని గౌరవించాలి. అందుకే ఈ స్వీట్లు" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ నాయకులకు ఒక పాఠం లాంటివి. తమపై ఎంతో గట్టిగా పోరాడిన ప్రత్యర్థులకు స్వీట్లు పంచి, వారిని అభినందించిన ఈ చర్య... థరూర్ వ్యక్తిత్వంలో ఉన్న నిరాడంబరత మరియు విన్నర్ యాటిట్యూడ్కు నిదర్శనం. రాజకీయ ప్రత్యర్థుల మధ్య కూడా గౌరవం ఉండాలని చాటిచెప్పిన ఈ కాంగ్రెస్ నాయకుడి చర్యకు సోషల్ మీడియాలో భారీ ప్రశంసలు దక్కుతున్నాయి.