బిగ్ బాస్ 3 నిర్వాహకులపై మహేష్ విట్టా సంచలన వ్యాఖ్యలు...

praveen

తెలుగు  టెలివిజన్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రియాల్టీ షో గా ప్రేక్షకులను అలరిస్తున్న  కార్యక్రమం బిగ్ బాస్  తెలుగు సీసన్ 3. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో తెలుగు ప్రేక్షకులను  కట్టిపడేస్తుంది. ఇక నాగార్జున తనదైన హోస్టింగ్ తో  ప్రేక్షకుల అందరిని  ఆకర్షిస్తూన్నారు . అయితే 17 మంది  కంటెస్టెంట్స్ తో మొదలైన బిగ్ బాస్ 3 రియాల్టీ షో ప్రస్తుతం చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే హౌస్ లో ఉన్న సభ్యులందరూ ఒకరి తర్వాత ఒకరు ఎలిమినేట్ అవ్వగా చివరికి ప్రస్తుతం ఆరుగురు సభ్యులు హౌస్ లో కొనసాగుతున్నారు. 

 

 

 

 అయితే హౌస్ లో ఉండి ఎలిమినేషన్ ద్వారా బయటికి వెళ్లిన సభ్యులు బిగ్ బాస్ గురించి,  కంటెస్టెంట్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.కాగా  బయటకు వచ్చిన కంటెస్టెంట్ లు  చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే గత వారం ఎలిమినేట్ అయిన మహేష్ విట్టా  తాజాగా బిగ్ బాస్ నిర్వాహకుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్  హౌస్ నిర్వాహకులు కొందరు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మహేష్ విట్టా  ఆరోపించారు. యాంకర్ శ్రీముఖికి  మాత్రమే పేవర్  చేస్తూ శ్రీముఖి హౌస్ లో కొనసాగేలా సహాయం చేస్తున్నారు అంటూ మహేష్ విట్టా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా శ్రీముఖి ఒకవేళ బిగ్ బాస్ విన్నర్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు మహేష్ విట్టా.

 

 

 

 

 అయితే అంతకుముందు కూడా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన హిమజా... బిగ్ బాస్ శ్రీముఖి హెల్ప్ చేస్తున్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ 3 శ్రీముఖి ని  విన్నర్ గా ప్రేక్షకుల్లో చూపించడానికి... ఎపిసోడ్ లో  శ్రీముఖి నే  ఎక్కువగా చూపిస్తున్నారని హిమజా  కామెంట్ చేసింది . ఇక ప్రస్తుతం బయటకొచ్చిన  మహేష్ కూడా అవే కామెంట్స్ చేయడంతో ప్రేక్షకులు  నిజంగానే బిగ్ బాస్  శ్రీముఖికి  హెల్ప్ చేస్తున్నాడా అనే ఆలోచనలో పడ్డారు. కాగా  మొన్న  ఆదివారం బిగ్ బాస్  హౌస్ నుంచి వితిక  ఎలిమినేట్ అవ్వగా... ప్రస్తుతం హౌస్ లో బాబా భాస్కర్, శ్రీముఖి,  అలీ రజా,  రాహుల్,  శివ జ్యోతి వరుణ్ సందేశ్ లు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: