బ్రదర్ అనిల్: చంద్ర బాబుపై యూటర్న్ ..!

Divya
ఏపీలోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త క్రైస్తవ మత ప్రబోధకుడు బ్రదర్ అనిల్ అందరికీ సుపరిచితమే.. కడప జిల్లాలోని బద్వేల్లో మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు బ్రదర్ అనిల్.. తప్పు ఎక్కడున్నా తప్పేనని తప్పును కప్పిపుచ్చుకోవాలని చూస్తే ఇవాళ కాకపోయినా రేపటి రోజునైనా సరే ఆ పాపం కచ్చితంగా తగులుతుంది అంటూ బ్రదర్ అని తెలిపారు. దేవుడు ప్రతి ఒక్కరికి పదవి ఇచ్చింది న్యాయం చేయడానికి అంటూ వెల్లడించారు.

గత ఎన్నికలలో దేవుడు 151 యొక్క సీట్లను ఇచ్చాడని టిడిపికి 23 సీట్లు.. 3 ఎంపీ సీట్లు మాత్రమే ఇచ్చారంటే తెలిపారు..ఎందుకంటే గతంలో జగన్ నుంచి అప్పటి అధికారంలో ఉన్న టిడిపి పార్టీ 23 మంది ఎమ్మెల్యేలను 3 ఎంపీలను తీసుకున్నారని అందుకే ఆ ఎన్నికలలో వాళ్లకు దేవుడు అవే సీట్లు ఇచ్చారని కూడా వెల్లడించారు.. అందుకే రాజకీయమైన జీవితమైనా ఒకటే.. అన్యాయం చేస్తే అది అన్యాయమే.. అన్యాయం చేసే వారికి కచ్చితంగా శిక్ష తప్పదు అంటూ కూడా తెలియజేశారు బ్రదర్ అనిల్.

దేవుడు మనిషికి అధికారం ఇచ్చిన తర్వాత పదవి వ్యామోహం పెరిగిపోయింది.. స్వార్థం చాలా ఎక్కువయ్యింది.. దేవుడు ఏదైనా మార్గం చూపించినప్పుడు ఆ మార్గం లో మనం వెళితేనే మంచి జరుగుతుంది.. ఆ మంచి కేవలం డబ్బు ఒకటే కాదంటూ కూడా బ్రదర్ అనిల్ తెలియజేశారు.. చంద్రబాబు అధికారంలోకి వస్తే వర్షాలు పడవని చెబుతూ ఉంటారు.. నిజంగానే ఆయన వస్తే వర్షాలు పడవు ఒక్కొక్కసారి ప్రభావం అలా ఉంటుంది అంటూ తెలియజేశారు. కానీ ఎవరు వచ్చిన ఎవరు ఏం చేసినా అది మంచి మనసుతో చేస్తే ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని కూడా తెలియజేశారు. కేవలం ఒక తటస్థ వ్యక్తిగా మాత్రమే ఈ విషయాలను చెప్పానని తెలియజేశారు బ్రదర్ అనిల్. గతంలో చంద్రబాబు మంచి చేయలేదని కూడా నేను చెప్పలేదని అంటూ బ్రదర్ అనిల్  వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: