"మనమే" సెకండ్ సింగిల్ ఈరోజు ఆ సమయానికి..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటువంటి శర్వానంద్ ప్రస్తుతం మనమే అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ జీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తి అయ్యింది.
 

దానితో కొన్ని రోజులు క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క టీజర్ ను విడుదల చేసింది. ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై జనాల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా బృందం ఈ మూవీ నుండి ఒక పాటను కూడా విడుదల చేసింది. ఆ పాట కూడా సూపర్ గా ఉండడంతో దానికి కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

ఇలా ఇప్పటి వరకు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు , పాటలు అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ప్రస్తుతానికి ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది.

ఈ మూవీ మేకర్స్ తాజాగా ఈ సినిమాలోని "ఓ మనమే" అంటూ సాగే రెండవ పాటను ఈ రోజు అనగా ఏప్రిల్ 30 వ తేదీన సాయంత్రం 5 గంటల 01 నిమిషానికి విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో శర్వానంద్ మరియు కృతి శెట్టి ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: