బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక సినిమా ‘సాహో. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అతి పెద్ద యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన సాహో ఈ నెల 30న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రద్ధా కపూర్ జోడీ కట్టింది. ఆమె లేడీ పోలీస్ ఆఫీసర్గా కనిపించనుంది. నీల్ నితిన్ ముఖేశ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమా కోసం చిత్రయూనిట్ ముమ్మరంగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది.
తాజాగా రిలీజ్ అయిన సాహో ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ‘సాహో’ చిత్ర బడ్జెట్పై అనేక రుమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ తన తాజా ఇంట్వ్యూలో సాహో బడ్జెట్పై స్పందించారు. రూ. 250 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కినట్టు ఇంతకముందు కథనాలు వచ్చాయి. అయితే ప్రబాస్ మాత్రం సాహోకు రూ.350 కోట్లు ఖర్చయినట్టు చెప్పారు.
సాహో ట్రైలర్లో పింక్ సరస్సు కనిపిస్తోంది. ఇది ఆస్ట్రేలియాలో ఉంది. అది కూడా నిజమైనదే. ప్రపంచం నలుమూలాల్లోని ఉత్తమమైన వాటిని ఒకచోట చేర్చి ఈ సినిమాలో చూపించామని చెప్పాడు. సాహోలో ప్రతిషాట్ కళ్లు జిగేల్మనేలా దర్శకుడు సుజీత్ చిత్రీకరించాడని ప్రశంసించాడు. ట్రైలర్కు కూడా తాము అనుకున్నట్టుగానే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు.
తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషాల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలవుతోంది. ఇక, అబుదాబిలో చిత్రీకరించిన ఓ ఛేజింగ్ సీన్ కోసం అక్షరాల రూ. 80 కోట్లు ఖర్చు పెట్టినట్టు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సాహో ట్రైలర్ యూ ట్యూబ్లో వీరంగం ఆడుతోంది. ఇక సాహో ఎలా తెరకెక్కించారు ? సాహో రిజల్ట్ ఏంటో తేలిపోయేందుకు ఈ నెల 30 వరకు ఆగాల్సిందే.