వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై ఎవరు ఊహించని కామెంట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు..!
ఇదిలా ఉండగా తాజాగా ఇటీవల మహేష్ బాబు ఇంగ్లాండ్ దేశంలో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై ఎవరు ఊహించని కామెంట్ చేశారు. చివరిదాకా సెమీ ఫైనల్ దాకా మంచిగా రాణించిన భారత జట్టు...సెమీ ఫైనల్ మ్యాచ్లో కివీస్ చేతిలో ఓడిపోవడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ పై మహేష్ బాబు తాజాగా స్పందించారు.
''ఇప్పటికీ వరల్డ్ కప్ మ్యాచ్ మైకంలోనే ఉన్నా.. అత్యంత ఉత్కంఠకు గురి చేసిన ఫైనల్ ఇది. ఇంగ్లాండ్ కప్ గెలిచి ఉండొచ్చు కానీ న్యూజిలాండ్ మాత్రం హృదయాలను గెలుచుకుంది. ఇరు జట్లకు అభినందనలు'' అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ కి రెడీ అవుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ తో పాటు విజయశాంతి కూడా నటిస్తోంది.