పిల్లల్ని కనకపోయినా పర్లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ వింధ్య..!!
మేము ఏదైతే ఎంజాయ్ చేయలేకపోయామో .. నువ్వు ఎంజాయ్ చేయాలి. నువ్వు పిల్లల్ని కనకపోయినా పర్లేదు .. నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్ .. నీకు నచ్చినట్టు ఉండు. ఎవరో ఏదో అన్నారని నీ ఇష్టాలను వదులుకోకు అని చెప్తుంది. పైగా క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం అని .. నీ క్యారెక్టర్ ని నువ్వు కోల్పోకు. నువ్వు ఏది చేయాలనుకుంటే అది చెయ్ .. ఎంజాయ్ చెయ్ అని చెప్తారు. చిన్నప్పటి నుంచి అది చెయ్ .. ఇది చేయకు అని చెప్పలేదు” అన్నారు. వింధ్య విశాఖ కు ఫిమేల్ యాంకర్స్ లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సోషల్ మీడియాలో సైతం ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. ప్రో కబడ్డీ, ఐపీఎల్, వరల్డ్ కప్ వంటి మెగా స్పోర్ట్స్ ఈవెంట్స్ కి వింధ్య విశాఖ తెలుగు ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. కాగా ఆమెకు క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు కూడా అయ్యాయని గతంలో చెప్పడం విశేషం.అలాగే ఈ సందర్భంగా తనకు సినిమా రంగం అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదని.. ఆ కారణంగానే గతంలో గోపాల గోపాల, ముకుందతో సహా పలు సినిమా అవకాశాలను వదులుకున్నానని వింధ్య వెల్లడించింది.