హైపర్ ఆది నన్ను మోసం చేసాడు అంటున్న లేడీ కమెడియన్..!!
అయితే తాజాగా ఓ షోలో పాల్గొన్న ఈమె తన పర్సనల్ లైఫ్ గురించి షాకింగ్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా తన జీవితాన్ని ఓ వ్యక్తి నాశనం చేశాడని చెప్పుకొచ్చింది. తనకు ఉపాధి కూడా లేకుండా చేసిన అతడే తనను పెళ్లి చేసుకోవాలని.. అప్పుడే తన జీవితం బాగు పడుతుందని కూడా వివరించింది. అయితే ఆమెకు మద్దతుగా.. యాంకర్ రష్మి కూడా నిలిచింది. అంతేకాకుండా హీరోయిన్ ఇంద్రజ కూడా అండగా ఉంటానని చెప్పుకొచ్చింది. అయితే రోహిణి జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తి ఎవరో కాదు. అతడు కూడా ఓ కమెడియన్ యే.తాజాగా వచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఈ తతంగం అంతా జరిగింది. అయితే రోహిణి లైఫ్ ను నాశనం చేసింది.. కమెడియన్ హైపర్ ఆదియేనని ఆమె చెప్పుకొచ్చింది. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి ఓ స్కిట్ చేశారు. అందులో బుగ్గలు, ఐస్ క్రీమ్ లు అమ్ముకునే మహిళగా.. రోహిణి కనిపించింది. అలా చిన్న పిల్లల వద్ద అన్నీ అమ్ముకుంటూ ఆమె కామెడీ చేయగా.. హైపర్ ఆది తిట్టినట్లు పంచులు వేశాడు. అలా చేస్తే డబ్బులు చెల్లించాల్సి వస్తుందని రోహిణి చెప్పగా... 200 ఇస్తూ మరీ ఆమెపై కామెంట్లు చేశాడు.
ఆమె తన వద్ద ఉన్న వస్తువులు అమ్మిన ప్రతీసారి హైపర్ ఆది ఏదో ఒకటు అంటుండడం చూపించారు. ఇలా అతడు తన పొట్టపై కొట్టాడని, తనను ఏమీ అన్నుకోనివ్వట్లేదని చెప్పుకొచ్చింది. ఇలా తన ఉపాధిని దూరం చేసి, తన జీవితాన్ని హైపర్ ఆది నాశనం చేశాడని తెలిపింది. అతడు తనను పెళ్లి చేసుకుని తన జీవితం బాగు చేయాలని కోరింది. అయితే యాంకర్ రష్మితో పాటు ఇంద్రజలు కూడా రోహిణికి అండగా నిలిచారు. నీకు సాయంగా మేముంటామని.. ఆది నిన్ను పెళ్లి చేసుకునేలా చూస్తామని చెప్పారు. ఇలా ఫన్నీ ఫన్నీగా సాగిందీ షో.