మహేష్ చరణ్ ని మరచిపోయాడా...!!

Satya
మహర్షి హాంగోవర్లో ఇపుడు మహేష్ బాబు ఉన్నాడు. ఇప్పటికి వంద కోట్లను వసూల్ చేసిన ఈ సినిమా రెండు వందల కోట్ల టార్గెట్ దిశగా పరుగులు తీస్తోంది. మహర్షి హిట్ తో మహేష్ లోని కొత్త మనిషి కూడా బయటకు వచ్చేశాడు. పాత విషయాలు గుర్తు చేసుకుని బాగా  ఎమోషనల్ అవడం, హగ్గులు ఇవ్వడం, తన కెరీర్ మొత్తం పనిచేసిన వారిని తలచుకుని థాంక్స్ చెప్పడం ఇలా మహేష్ లోపలి మనిషిని అంతా చూస్తున్నారు.


ఈ హపీ మూడ్ ఇలా ఉండగానే మహేష్ జూనియర్ కి పార్టీ ఇచ్చాడని టాక్. తారక్ తో కలసి మహర్షి సక్సెస్ ని మహేష్ పంచుకున్నాడని న్యూస్ ఒకటి టాలీవుడ్లో  వైరల్ అవుతోంది. అది బాగానే ఉంది కానీ రామ్  చరణ్ ని మహేష్ మరచిపోయాడా పార్టీకి పిలవలేదా అన్న దాని మీద కూడా హాట్ హాట్ డిస్కషన్ జరుగుతోంది.


ఇక మహేష్ తన సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా చూపిస్తారని అంటున్నారు రైతులంటే ఇష్టపడే పవన్ తాను కూడా రైతునని గర్వంగా చెప్పుకుంటారు. మరి మహేష్ రైతుగా అదరగొట్టిన మహర్షిని చూసి పవన్ ఎలాంటి కాంప్లిమెంట్ ఇస్తాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: