ప్రముఖ టివి, సినీ నటుడు కన్నుమూత!

Edari Rama Krishna

 గత కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.  నటులు, దర్శక, నిర్మాతల కన్నుమూత కలచి వేస్తున్నాయి. ప్రముఖ సినీ, టీవీ నటుడు సుభాష్ చంద్రబోస్ అలియాస్ బోస్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.  నాలుగు రోజుల క్రితం కృష్ణా నగర్‌లోని తన ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడ్డారు.


ఈ ఘటనలో అతని తలకు తీవ్ర గాయమైంది. దీంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. కృష్ణ వంశి దర్శకత్వంలో నటించిన ‘నిన్నే పెళ్లాడతా’  చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న ఆయన పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఇడియట్, శివమణి  చిత్రాల్లో నటించాడు. చిన్న వయసులోనే మధుమేహ వ్యాధి బారిన పడ్డ బోసు శరీర ఆకృతిలో మార్పు రావడంతో సినిమా అవకాశాలు బాగా సన్నగిల్లాయి.


దీంతో ఆయన స్మాల్ స్క్రీన్ కు మారాడు. దాంతో ఆయన టివి సీరియల్స్ లో నటించడం మొదలు పెట్టారు.  బోస్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: