‘పీఎమ్ నరేంద్ర మోదీ’ ముందుగానే వచ్చేస్తున్నారు!

Edari Rama Krishna
తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో ప్రస్తుతం బయోపిక్ ట్రెండ్ కొనసాగుతుంది.  తెలుగు లో మహానటి, ఎన్టీఆర్ బయోపిక్, యాత్ర చిత్రాలు వచ్చాయి.  త్వరలో మరికొన్ని బయోపిక్ చిత్రాలు రాబోతున్నాయి. బాలీవుడ్ లో కూడా వరుసగా బయోపిక్ చిత్రాలు వస్తున్నాయి.  తాజాగా  ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్  ప్రధాన పాత్రధారిగా 'పీఎమ్ నరేంద్రమోదీ'  నిర్మితమైంది. 

ఈ చిత్రానికి రేశ్ ఒబెరాయ్,సందీప్ సింగ్,ఆనంద్ పండిట్,ఆచార్య మనీశ్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కొన్ని పోస్టర్లు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.  ఒక చాయ్ వాలా దేశాన్ని ఏలే నాయకుడిగా ఎలా ఎదిగాడు అన్న అంశాలు ఈ చిత్రంలో చూపించబోతున్నారట. 

ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 12వ తేదీన విడుదల  చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఒక వారం ముందుగానే విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.  ఈ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.  ఆదర్శవంతమైన ఆయన జీవితచరిత్రకి ఏ స్థాయి ఆదరణ లభిస్తుందో చూడాలి.
5th April 2019 🙏 #PMNarendraModi pic.twitter.com/fnGSuLxHZu

— Vivek Anand Oberoi (@vivekoberoi) March 19, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: