లుంగీ కట్టి.. కల్లు తాగి.. ఎంజాయ్‌ చేద్దామన్న ముదురు హీరోయిన్..?

Chakravarthi Kalyan

అమలాపాల్.. ఈ అమ్మడు గుర్తుందా.. ఇద్దరమ్మాయిలతో చిత్రంతో.. అమాయకంగా నటిస్తూనే అందాలతో ఊరించిన ఈ అమ్మడు ఇప్పుడు పెద్దగా తెలుగు చిత్రాల్లో కనిపించడం లేదు. నాయక్, ఇద్దరమ్మాయిలతో.. చిత్రంతో తెలుగులో ఫేమస్ అయిన అమలాపాల్.. ఆ తర్వాత పెద్దగా సక్సస్ కాలేదు. ఒకటి రెండు సినిమాలు చేసినా పెద్దగా అవకాశాలు రాలేదు.



తెలుగు చిత్ర సీమను లైట్ తీసుకుని తమిళ, మళయాల సినిమాలపై ఫోకస్ చేసినా పెద్దగా ఫలితం కనిపించలేదు. దీనికితోడు ప్రేమ, పెళ్లి వంటి వివాదాలతో కెరీర్ కాస్త దారి తప్పింది. అంతకుముందు ముద్దుముద్టు మాటల మైనాలా ఉన్న అమలాపాల్ పెళ్లి కాస్తా పెటాకులయ్యాక ఇప్పుడు బాగా మాటలు నేర్చేసింది.



సినిమాలతో పాటు.. సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు మాంచి జోరు చూపుతోంది. ఇటీవలే ఈమె నటించి రాక్షసన్ సినిమా బంపర్ హిట్ గా నిలవడంతో అమ్మడు మంచి ఊపు మీద ఉంది. ఆ హిట్ జోరుతోనే ఏమో సోషల్ మీడియాలో అదిరిపోయే పోస్టులు పెడుతోంది.



తాజాగా కేరళలోని ఓ అటవీ ప్రాంతానికి ఆటవిడుపుగా వెళ్లిన అమలాపాల్ అక్కడ సాంప్రదాయ లుంగీ కట్టి సందడి చేసింది. అంతే కాదు.. లుంగీ కడతాం.. ఇక్కడ దొరికే కల్లు తాగుదాం.. రండి. అంటూ ఫ్యాన్స్ ను చిలిపిగా పోస్టులతో కవ్వించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: