తమ్ముడూ అంటూ ఆప్యాయంగా పిలిచేవారు : నాగార్జున

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో నందమూరి, అక్కినేని ఫ్యామిలీ అంటే ఎంతగానో గౌరవిస్తారు.  ఈ కుటుంబాల నుంచి స్టార్ హీరోలు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.  నందమూరి తారక రామారావు వారసులుగా హరికృష్ణ, బాలకృష్ణ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.  ప్రస్తుతం హరికృష్ణ తనయులు ఎన్టీఆర్, కళ్యాన్ రామ్ లు హీరోలుగా రాణిస్తున్నారు.  ఇక అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా అక్కినేని నాగార్జున హీరోగా ఎంట్రీ ఇచ్చారు.  ప్రస్తుతం ఆయన వారసులుగా నాగచైతన్య, అఖిల్ లు హీరోలుగా రాణిస్తున్నారు. 

అయితే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లో ఎంతో గొప్ప స్నేహితులు..ఆత్మబంధువులు.  ఈ బంధాన్ని వారి పిల్లలు కూడా కొనసాగించారు.  నేడు ఉదయం నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.  ఆయన మరణ వార్త విన్న అక్కినేని నాగార్జున్ ఒక్కసారే షాక్ కి గురయ్యారు.  ఈ సందర్భంగా నాగార్జున ఎంతో హృదయ విధారకంగా తనతో ఉన్న సంబంధాన్ని గురించి తెలిపారు. 

చాలా రోజులు ఐయింది నిన్ను చూసి, కలవాలి తమ్ముడు" అని తనతో చివరిగా ఫోన్ లో హరికృష్ణ మాట్లాడారని హీరో నాగార్జున కొద్దిసేపటి క్రితం తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. హరికృష్ణ మరణవార్తను తెలుసుకున్న తరువాత, తాను ఒంటరిని అయిపోయినట్టు అనిపిస్తోందని నాగ్ పేర్కొన్నారు. కొన్ని వారాల క్రితం హరికృష్ణ తనతో అన్న మాటలను గుర్తు చేసుకున్న నాగార్జున "ఐ మిస్ యూ అన్నా" అంటూ తన భావోగ్వేగాన్ని వ్యక్తం చేశారు. 
చాలా రోజులు ఐయింది నిన్ను చూసి, కలవాలి తమ్ముడు..that’s what he said a few weeks ago and now he is gone.all I feel is a void,I will miss you Anna!!!! pic.twitter.com/T9epx3ZEEk

— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 29, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: