టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న బయోపిక్స్లో యాత్ర ఒకటి. ఇప్పటికే ఇండస్ట్రీలో మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా చేసుకొని ‘మహానటి’సినిమా తెరకెక్కించారు. మరోవైపు మహానటులు ఎన్టీఆర్ బయోపిక్ క్రిష్ దర్శకత్వంలో రూపొందుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ కనిపించబోతున్నారు. ఇక బాలీవుడ్ లో కూడా ఇప్పటికే ఎం.ఎస్.ధోనీ బయోపిక్ ఆధారంగా ‘ధోని’సినిమాకు మంచి విజయం దక్కింది. ఇక బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవిత కధ ఆధారంగా ‘సంజు’త్వరలో రిలీజ్ కాబోతుంది.
ఇక దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘యాత్ర’.వైఎస్ పాత్రలో మళియాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్న విషయం తెలసిందే. ఆనందోబ్రహ్మ చిత్రం ఫేమ్ మహీ రాఘవ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. 70 ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 30 కోట్ల బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ రూపొందుతుంది.
జూన్ 20న చిత్ర షూటింగ్ ప్రారంభం కాగా, చిత్రంలో వైఎస్ ఆర్ పాత్ర పోషిస్తున్న మమ్ముట్టికి యూనిట్ గ్రాండ్ వెలకమ్ చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యాత్ర సినిమా కోసం మహి వి రాఘవ ముఖ్య పాత్రలని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. వైఎస్ విజయమ్మ పాత్ర కోసం బాహుబలి ఫేం ఆశ్రితని సెలక్ట్ చేసిన దర్శకుడు, వైఎస్ పర్సనల్ అసిస్టెంట్ సూరీడు పాత్ర కోసం పోసాని కృష్ణ మురళి, షర్మిళ పాత్ర కోసం భూమిక, సబితా ఇంద్రా రెడ్డి పాత్ర కోసం సుహాసినిని సెలక్ట్ చేసినట్టు టాక్.
గతంలో రౌడీ కూలీ, సూర్య పుత్రులు, స్వాతి కిరణం వంటి తెలుగు చిత్రాల్లో నటించిన మమ్ముట్టి పాతికేళ్ల తర్వాత యాత్ర మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. ‘కడప దాటి వస్తున్నా.. మీ గడప కష్టాలు వినటానికి’అనే ట్యాగ్ లైన్తో వస్తున్న ఈ సినిమాలో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ముఖ్యంగా చూపించనున్నారని సమాచారం.
Welcoming @Mammootty Sir to the sets of #YATRA.. PROUD moment.. pic.twitter.com/PT5gUITQMU— M B Varaprasad (@MBVaraprasad4) June 23, 2018