సీతారామస్వామి సన్నిధిలో ఎన్టీఆర్ దంపతులు..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో ఎన్టీఆర్.  గత మూడు సంవత్సరాల నుంచి మనోడికి గోల్డెన్ టైమ్ నడుస్తుందని చెప్పాలి.  టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ లాంటి వరుస హిట్లతో దూసుకెళుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ శుక్రవారం భద్రాచలం ఆలయాన్ని సతీ సమేతంగా దర్శించుకున్నాడు.  బాబీ దర్శకత్వంలో రిలీజ్ అయిన జై లవ కుశ మంచి సక్సెస్ కావడంతో ఎన్టీఆర్ మంచి ఖుషీలో ఉన్నారు. 

ఎన్టీఆర్ సతీమణి  లక్ష్మీప్రణతితో కలసి సీతారామస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  వీరి వెంట ప్రముఖ దర్శకలు కొరటాల శివ కూడా ఉన్నారు.  సీతారాముల స్వామిని దర్శనానికి వచ్చిన ఎన్టీఆర్ దంపతులను ధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీతారాములకు ఎన్టీఆర్ దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు.

దర్శనానంతరం అర్చకులు ఆశీర్వచనం పలికి, తీర్థప్రసాదాలను అందించి, భద్రాద్రి విశిష్టతను తెలియజేశారు.  ఇక భద్రాచలనం శ్రీరాముని దర్శనానికి వచ్చిన ఎన్టీఆర్ ని చూసేందుకు అభిమానులు తరలి వచ్చారు.   

ఎన్టీఆర్ రాక సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. ఎన్టీఆర్ కూడా అభిమానులకు అభివాదం చేస్తూ, కొందరిని ఆప్యాయంగా పలకరించారు. ఎన్టీఆర్‌తో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా సతీసమేతంగా స్వామి వారి సేవలో పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: