బుల్లితెరపై మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ ఎంట్రీ ..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో మాస్ హీరోగా అందరి హృదయాలు కొల్లగొట్టిన వాడు...డ్యాన్స్, ఫైట్స్ కి కొత్త నిర్వచనం చెప్పిన వాడు..అందరివాడు ఎవరయ్యా అంటే వెంటనే చెబుతారు మెగాస్టార్ చిరంజీవి. తెలుగు ఇండస్ట్రీలో మంచి హీరోగా కొనసాగుతున్న సమయంలో ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వెళ్లిన మెగాస్టార్ కాంగ్రెస్ పాలనలో కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. దాదాపు పది సంవత్సరాల తర్వాత మళ్లీ సినీరంగ ప్రవేశం చేస్తున్నారు. వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెం.150’ చిత్రంలో ద్విపాత్రాభినయంతో అభిమానుల ముందుకు రాబోతున్నారు చిరంజీవి.

ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు మరో హ్యాపీ న్యూస్..గత కొంత కాలంగా అక్కినేని నాగార్జున నిర్వహిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికే మూడు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న నాగ్ హాట్ సీట్స్‌లో ఉన్నవారితో షోస్‌ని సక్సెస్ ఫుల్ గా రన్ చేయగా నాలుగో సీజన్ లో మెగా స్టార్ చిరంజీవి ఆ బాధ్యతలను తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఈ ప్రోగ్రాంకు సంబంధించి సన్నాహాలు చేస్తోండగా చిరుపై ఫోటో షూట్ కూడా నిర్వహించారు.

ఒకవైపు కత్తి రీమేక్‌గా ఖైదీ నెం.150 చిత్రం చేస్తున్న చిరంజీవి మరోవైపు పాపులర్ ప్రోగ్రాం మీలో ఎవరు కోటీశ్వరుడు చిత్రంతో కోట్లాది హృదయాలను కొల్లగొట్టేందుకు వస్తున్నాడు.  తాజాగా మీలో ఎవరు కోటీశ్వరుడు ఫోర్త్ సీజన్‌కి సంబంధించి చిన్న ప్రోమో విడుదల చేశారు.

కోట్ల హృదయాలని కొల్లగొట్టిన వాడు.. మీతో కోటి గెలిపించడానికి వస్తున్నాడు అంటూ మెగా అభిమానులను పలకరించడానికి వస్తున్నాడు. కొద్ది రోజుల్లో ఈ ప్రోగ్రాం టెలికాస్ట్ కానుండగా టీఎర్‌పీ రేటింగ్ దుమ్ము దులపడం ఖాయం అంటూ విశ్లేషకులు చెబుతున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: