క్రేజీ ప్రాజెక్ట్స్ తో స్టార్ డం కోసం ట్రై చేస్తున్న యంగ్ హీరో...!!

murali krishna
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్..అల్లుడు శీను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అప్పట్లో ఆ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో హిట్లు, ఫెయిల్యూర్స్ రుచి చూశారు. ఛత్రపతి ఫ్లాప్ కావడంతో ఆయన బాలీవుడ్ ప్లాన్స్ ప్రస్తుతానికి ఆగిపోయాయి.సో షియో ఫాంటసీ సినిమాలకి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. కాకపోతే కథకి, కథనానికి… లాజిక్, వి.ఎఫ్.ఎక్స్ వంటివి పర్ఫెక్ట్ గా ఉండాలి. లేదు అంటే ఫలితం తేడా కొట్టేస్తుంది.ఈ మధ్య కాలంలో చూసుకుంటే సోషియో ఫాంటసీ అనేది సేఫ్ గేమ్ అని మన టాలీవుడ్ డైరెక్టర్స్ డిసైడ్ అయినట్టు కనిపిస్తుంది.2024 లో ఇప్పటివరకు చూసుకుంటే ‘హనుమాన్’ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. అలాగే ఫిబ్రవరిలో వచ్చిన సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’, మార్చిలో వచ్చిన గోపీచంద్ ‘భీమా’ వంటి సినిమాలు కూడా సోషియో ఫాంటసీ టచ్ ఉన్నవే.ఈ యంగ్ హీరో తాజాగా సాగర్ చంద్ర దర్శకత్వంలో టైసన్ నాయుడు సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.అలాగే కౌశిక్ దర్శకత్వంలో “కిష్కిందపురి” అనే సినిమాకు సంతకం చేయగా, త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.ఇదిలా ఉంటే బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే ఓ బిగ్గెస్ట్ మూవీలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు.దాదాపు రూ.50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా బైరెడ్డి దర్శకుడిగా పరిచయం కానున్నారు .అయితే ఈ చిత్రం స్క్రిప్ట్ బెల్లంకొండ శ్రీనివాస్ కు నచ్చడంతో చిత్ర బృందం ప్రీ ప్రొడ క్ష న్ కార్యక్రమాలు జరిపింది. ఈ సినిమాను ప్రారంభించడానికి సరైన నిర్మాణ సంస్థ కోసం ఆయన ఎదురుచూస్తున్నారు.అయితే త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. అయితే బెల్లంకొండ తన స్టైల్ కు భిన్నంగా సినిమాలు చేయబోతుండటంతో మరోసారి రిస్క్ చేస్తున్నాడని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: