సాయికుమార్ జోస్యం ఫలించిందట..!

Edari Rama Krishna
అదేంటీ సాయికుమార్ ఈ మద్య జోస్యం కూడా చెబుతున్నారా..! అనుకుంటున్నారా..అవునండీ ‘జనతా గ్యారేజ్’ గురించి ఆయన ముందే జోస్యం చెప్పారట. ఈ చిత్రం షూటింగ్ లో ఉన్నపుడే ఎన్టీఆర్ కి ‘జనతా గ్యారేజ్’ ఖచ్చింతంగా వంద కోట్ల క్లబ్ లో చేరుతుందని అన్నారట. అది కాస్తా ఇప్పుడు నిజం కావడంతో ఆయన సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.  అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ తో ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రంలో నటించిన సాయికుమార్ ఆయనతో నటించినంత అనుభూతి జూనియర్ ఎన్టీఆర్ తో కలిగిందని తాను పెద్దాయనతోనే నటిస్తున్నంత సంతోషం కలిగిందని అన్నారు.

ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే తాను ఎన్టీఆర్ తో జనతా గ్యారేష్ ఖచ్చితంగా వంద కోట్ల కొల్లగొట్టడం ఖాయమని అన్నానని ఇప్పుడు అది నిజం కావడం ఎన్టీఆర్ తో పాటు చిత్ర యూనిట్ కూడా చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ చిత్రంలో తాను ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించే అవకాశం కల్పించిన కొరటాలకు ధన్యవాదలు తెలిపారు. అంతే కాదు ఆడియో వేడుకలో కూడా చిత్రం అద్భుతమైన విజయం సాధిస్తుందని అందరి అంచనాలు ఎన్టీఆర్ అందుకుంటారని నిజంగానే ఈ చిత్రంతో ఎన్టీఆర్ అన్ని వర్గాల ప్రజాదరణ పొందారని అన్నారు.

ఇంతకుముందు జనతా గ్యారేజ్ సక్సెస్ మీట్ లో కూడా ఇదే విషయం చెప్పానని కాగా ఇప్పుడు 125 కోట్లకు పైగా వసూల్ అయినందుకు  నేను చెప్పిన మాట ఇప్పుడు నిజం అయినందుకు సంతోషంగా ఉందని అంటున్నాడు సాయి కుమార్ . 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: