రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జాన్ (వర్కింగ్ టైటిల్) ఇటీవల రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకోగా తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగనుంది. ఈషెడ్యూల్ కోసం రామోజీ ఫిలిం సిటీ లో భారీసెట్ లను నిర్మించాడు ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా రెండో హీరోయిన్ గా సాష ఛెత్రి కనిపించనుంది. ఎయిర్ టెల్ యాడ్ ద్వారా ఫేమస్ అయిన సాషా ఇటీవల ఆది నటించిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ అనే చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఈ చిత్రంతోనే ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా జాన్ రూపంలో సాషా కు లక్కీ ఛాన్స్ వచ్చింది. మరి ఈ చిత్రం ఆమె కెరీర్ కు ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి. హైదరాబాద్ లో జరుగనున్న నెక్స్ట్ షెడ్యూల్ లో సాషా కూడా జాయిన్ కానుంది. పీరియాడికల్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గోపికృష్ణ మూవీస్ ,యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా సైరా ఫేమ్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఈరోజు ప్రభాస్ తన 40వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. ఈసంధర్బంగా సోషల్ మీడియా లో ప్రభాస్ కు భారీ సంఖ్యలో అభిమానులు , సెలబ్రెటీలు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఇక బాహుబలి తరువాత రెండేళ్ల గ్యాప్ అనంతరం ఇటీవల సాహో తో ప్రేక్షకులముందుకు వచ్చిన ప్రభాస్ కు ఈ చిత్రం షాక్ ఇచ్చింది. సాహో తెలుగు , తమిళ ,మళయాలం లో డిజాస్టర్ అవ్వగా హిందీ లో మాత్రం సూపర్ హిట్ అయ్యి ప్రభాస్ రేంజ్ ను అమాంతంగా పెంచేసింది.