డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారికి హెల్ప్ చేయండి రజినీకాంత్ ఫ్యాన్స్ కి పిలుపు..!
దీంతో రజినీకాంత్ ఇచ్చిన సలహాపై విలక్షణ నటుడు కమల్ హాసన్ సోషల్ మీడియా లో సంచలన వ్యాఖ్యలు చేశారు. నేలవేము కషాయం తాగితే వికటించి లేనిపోని చిక్కులొస్తాయని కమల్ ట్వీట్ చేశారు. ఈ విషయం అప్పట్లో పెద్ద వివాదంగా మారింది. అయితే ఈ క్రమంలో నేలవేము కషాయం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుందని పరిశోధనల ద్వారా రుజువైందని, డెంగీ నిరోధానికి ఈ కషాయం చాలా మంచిదంటూ ఓ పిటీషన్ కోర్టులో వేసారు. ఆ కషాయాన్ని తాను పలుమార్లు తీసుకున్నానని, ఎలాంటి ఆరోగ్య సమస్యలూ రాలేదని, వాస్తవాలు ఇలా ఉన్నప్పుడు కమల్ ఈ కషాయంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పంపిణీ చేయొద్దని అభిమానులకు ఎలా విజ్ఞప్తి చేస్తారని పిటిషన్లో ప్రశ్నించారు.
కాగా ప్రస్తుతం మురగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన దర్బార్ షూటింగ్ పూర్తయిన క్రమంలో ఈ నెల 13వ తారీఖున హిమాలయాలకు వెళ్ళిన రజినీకాంత్ అక్కడ ఐదు రోజులు గడిపి తెలుగు ఇటీవల చెన్నై కి చేరుకున్నారు. ఈ సందర్భంగా చెన్నై ఎయిర్ పోర్ట్ లో మీడియాతో మాట్లాడుతూ...హిమాలయాల్లో తన ఆధ్యాత్మిక ప్రయాణం చాలా చక్కగా జరిగిందని మరియు అదే విధంగా తాను నటించిన దర్బార్ సినిమా అవుట్ పూట్టు కూడా బాగా వచ్చిందని రజినీకాంత్ తెలియజేశారు.