"గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" మూవీకి సీక్వెల్... క్లారిటీ ఇచ్చిన నాగవంశీ..!

Pulgam Srinivas
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో అందాల ముద్దుగుమ్మ నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అంజలి ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ ని మే 17 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది.

ఇకపోతే ఈ టీజర్ విడుదలకు సంబంధించి ఈ మూవీ యూనిట్ ఓ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ ఈవెంట్ లో భాగంగా ఈ సినిమా ప్రొడ్యూసర్ అయినటువంటి సూర్య దేవర నాగ వంశీ నీ ఓ విలేకర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ కి సీక్వల్ ఉంటుందా అనే ప్రశ్న వేశాడు. దానికి ప్రొడ్యూసర్ నాగ వంశీ స్పందిస్తూ ... కచ్చితంగా ఉంటుంది. అందుకు సంబంధించిన వివరాలను మరికొన్ని రోజుల్లోనే తెలియజేస్తాం అని చెప్పుకొచ్చాడు. దీనితో ఇప్పటికే ఈ మూవీ కి మేకర్స్ సీక్వెల్ ను ప్లాన్ చేసుకున్నట్లు అర్థం అవుతుంది.

ఒక వేళ సినిమా కనుక మంచి రిజల్ట్ తెచ్చుకుంటే దీనికి సీక్వల్ ను రూపొందించే అవకాశాలు దాదాపుగా ఉన్నట్లే తెలుస్తోంది. ఒక వేళ సినిమా కనుక విజయాన్ని సాధించినట్లు అయితే ఈ మూవీ బృందం వారు ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళతారో చూడాలి. ఇక నిన్న విడుదల చేసిన టీజర్ అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ఫుల్ లెన్త్ మాస్ ఎంటర్టైనర్ గా రూపొందినట్లు నిన్న విడుదల చేసిన టీజర్ తో క్లియర్ గా అర్థం అవుతుంది. మరి ఈ సినిమా విశ్వక్ సేన్ కి ఏ రేంజ్ విజయాన్ని , ఏ స్థాయి క్రేజ్ ను తీసుకువస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

sv

సంబంధిత వార్తలు: