నీవెవరో : రివ్యూ
తానో బ్లైండ్ మ్యాన్ అయినా సరే రెస్టారెంట్ నడిపే కళ్యాణ్ (ఆది పినిశెట్టి) తన స్నేహితురాలు అను (రితిక సింగ్)ను ప్రేమిస్తాడు. సరదాగా సాగే అతని లైఫ్ లోకి వెన్నెల (తాప్సి) వస్తుంది. ఆమె వచ్చిన తర్వాత కళ్యాణ్ లైఫ్ లో మార్పులు వస్తాయి. ఇక ఓ యాక్సిడెంట్ లో కళ్యాణ్ తన కంటిచూపు తిరిగి వస్తుంది. అయితే అప్పటిదాకా ఉన్న వెన్నెలను దూరం చేసుకుంటాడు. వెన్నెల ఎక్కడికి వెళ్లింది..? అసలు వెన్నెల ఎవరు..? తన కోసం కళ్యాణ్ ఏం చేశాడు అన్నది సినిమా కథ.
తెలుగులో హీరోగా ప్రయత్నించి ఆ తర్వాత విలన్ అండ్ సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తున్నాడు ఆది పినిశెట్టి. సరైనోడు, నిన్ను కోరి, అజ్ఞాతవాసి సినిమాల్లో నటించాడు ఆది పినిశెట్టి. ఇక ఇప్పుడు సోలో హీరోగా మళ్లీ మరో ప్రయత్నం చేశాడు. దర్శకుడు రాసుకున్న పాత్రకు ఆది నూటికి నూరు పాళ్లు న్యాయం చేశాడు. బ్లైండ్ గా ఆది మెప్పించాడు. తాప్సీ కూడా తన పాత్రలో అదరగొట్టింది. రితిక సింగ్ గురు తర్వాత ఈ సినిమాలో కనిపించగా అమ్మడు కూడా తన వరకు బాగానే చేసింది. జీవా, శివాజి రాజా, వెన్నెల కిశోర్ అందరు బాగానే చేశారు.
సాయి శ్రీరాం సినిమాటోగ్రఫీ ఇంప్రెస్ చేసింది. థ్రిల్లర్ కు కావాల్సిన కెమెరా వర్క్ కనబరిచాడు. అచ్చు రాజమని మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది. సాంగ్స్ అంతగా ఇంప్రెస్ చేయకున్నా బిజిఎం ఆకట్టుకుంది. కథ, కథనాల్లో దర్శకుడు హరినాధ్ మంచి ప్రయత్నమే కాని మెప్పించేట్టుగా తీయలేదు. కథనం మరి ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.