ఈ ముగ్గురు హీరోయిన్స్ అందులో తోపు..కెవ్వు కేక..ఇప్పటివరకు ఏ బ్యూటీ కూడా అలా చేయలేదు..!

Thota Jaya Madhuri
సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోయిన్స్ ఉంటారు కొదవేలేదు . అయినప్పటికీ కొంతమంది అందాల ముద్దుగుమ్మలు తమ పేరుని పాపులర్ చేసుకోవడానికి ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టి ..పలు రకాల విషయాలల్లో కాంప్రమైజ్ లు కూడా అవుతూ ఉంటారు.  అయితే ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టి హిట్ కొట్టిన కొన్ని కొన్ని రికార్డ్స్ కొంతమందికే సాధ్యమవుతాయి . అలాంటి ఒక క్రేజీ రికార్డ్ అందుకున్నారు ఇక్కడ మీరు చూస్తున్న ఈ ముగ్గురు హీరోయిన్స్...!!!
కాజల్ అగర్వాల్: కాజల్ టాలీవుడ్ లోకి లక్ష్మీ కళ్యాణం అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలను ఓకే చేస్తూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది . అయితే మెగా ఫ్యామిలీ లో ఉన్న నలుగురు హీరోలతో కలిసి నటించి ఒక క్రేజీ రికార్డ్ క్రియేట్ చేసింది. కాజల్ ..చిరంజీవితోను పవన్ కళ్యాణ్ తోను అదే విధంగా రామ్ చరణ్ తోను బన్నీతోను కలిసి నటించింది ఈ అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ .
శృతిహాసన్:  కమలహాసన్ కూతురుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్.. కెరియర్ స్టార్టింగ్ లో ఒక్క హిట్ కొట్టడానికి చాలా చాలా కష్టపడింది . ఆ తర్వాత ఎలాగోల హిట్ అందుకుంది . ఆశ్చర్యం ఏంటంటే ఈ ముద్దుగుమ్మ కూడా చిరంజీవి - పవన్ కళ్యాణ్ - బన్నీ -రామ్ చరణ్ తో కలిసి నటించింది . కాజల్ తర్వాత అలాంటి క్రేజీ రికార్డ్ అందుకుంది ఈ బ్యూటీనే.
తమన్నా: మిల్కీ బ్యూటీ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.  ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఉన్నప్పటికి తమన్నా నే ది మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్ అంటూ చాలామంది చెప్పుకొస్తూ ఉంటారు . తమన్నా కూడా పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ - బన్నీ లతో స్క్రీన్ షేర్ చేసుకుంది . చిరంజీవితో నటించిన కానీ హీరోయిన్ గా స్క్రీన్ షేర్ చేసుకోలేకపోయింది . ఇలా ఈ ముగ్గురు హీరోయిన్స్ మెగా హీరోలతో క్రేజీ రికార్డు నెలకొల్పారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: