డ్రగ్స్ కేసులో చిక్కుకున్న మరో హీరోయిన్.. ఆందోళనలో ఫ్యాన్స్..!

Divya
లీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని నెలలుగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఒక ఊపు ఊపేస్తున్న తరుణంలో ఇప్పుడు తాజాగా డ్రగ్స్ వ్యవహారం మరొకసారి తెరమీదికి వచ్చింది. ఒక గ్యాంగ్స్టర్ అయిన ఓం ప్రకాష్ నిర్వహించినటువంటి డీజే పార్టీలో డ్రగ్స్ ఉన్నట్లుగా పోలీసులు ఆధారాలతో సైతం పట్టుకున్నారు. ఇప్పటికి దాదాపుగా ఇతని మీద 30 క్రిమినల్ కేసులు కూడా ఉన్నట్లు సమాచారం. ఇటువంటి వ్యక్తితో మలయాళ సినీ పరిశ్రమకు చెందిన చాలామంది నటీనటులు పరిచయాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారట.

అక్టోబర్ 5వ తేదీన ఓం ప్రకాష్ అతని స్నేహితుడు డ్రగ్స్ తీసుకోవడంతో పాటు విక్రయించారని ఆరోపణలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఈ విషయం పైన పోలీసులు ఆరా తీయగా వారిని విచారించారు. మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది నటీనటుల పేర్లు కూడా తెలియజేశారట. కానీ ఆధారాలను  కోర్టుకు అందించడంలో అధికారులు విఫలం అవ్వడం చేత.. ఓం ప్రకాష్ అతని స్నేహితుడుకు బెయిల్ వచ్చిందట. అయితే ఈ డ్రగ్స్ గ్యాంగ్ స్టార్ తో టచ్ లో ఉన్న నటీనటుల విషయం పైనే ఇప్పుడు ఒక చర్చ జరుగుతున్నది.

ముఖ్యంగా మంజుమ్మల్ బాయ్స్ సినిమాతో పేరు సంపాదించిన నటుడు శ్రీనాథ్ తో పాటుగా పిశాచి సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన నటి ప్రయాగ మార్టిన్ ఈ డ్రగ్స్ వ్యవహారంతో లింక్ ఉన్నట్లుగా మలయాళ సినీ ఇండస్ట్రీలో వార్తలైతే ఇప్పుడు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కూడా ఆ గ్యాంగ్స్టర్ ఇచ్చిన పార్టీలో పాల్గొన్నట్లు సమాచారం. అయితే వీరిద్దరూ కూడా ఎన్నోసార్లు అతడు గదికి కూడా వెళ్లినట్లు సమాచారం. వీరితో పాటుగా సుమారుగా 20 మందిపైగా మలయాళ నటీనటులు గ్యాంగ్ స్టార్ ఓం ప్రకాష్ తో టచ్ లో ఉన్నట్లు అధికారులు గుర్తించారట. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అందుకు సంబంధించిన వ్యవహారాలను చూసినప్పటికీ బయటికి విడుదల చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: