వామ్మో: రూ.3500 కోట్ల వారసుడితో టాలీవుడ్ హీరోయిన్ ప్రేమాయణం.. కానీ..?

Divya
టాలీవుడ్ బాలీవుడ్ లో తనకంటూ ఒక ఇమేజ్ను సంపాదించుకుంది హీరోయిన్ కృతిసనన్.. తాజాగా ఈ ముద్దుగుమ్మ ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా కబీర్ దూహియాతో ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ దుబాయ్ లో కలిసి దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం చేత ఈ విషయం వినిపిస్తోంది. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా బర్తడే వేడుకలలో కూడా కబీర్ దూహియా కనిపించడంతో కృతి అతనితో డేటింగ్ చేస్తోందనే విధంగా వార్తలు వినిపించాయి.

కబీర్ దూహియా ఎవరో కాదు యూకేకి చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త.. ఈయన తండ్రి కూడా కుల్జాందర్ బాహియా. ఈయన సౌత్ ట్రావెల్ వ్యవస్థాపకుడట. లండన్ లో అత్యంత ధనిక  కుటుంబాలలో వీరిది కూడా ఒకటి అన్నట్లుగా తెలుస్తోంది. వీరి ఆస్తి మొత్తం సుమారుగా రూ .3500 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం లండన్ల లో వ్యాపారాలను చూసుకుంటూ ఉన్నారట కబీర్ దూహియా. అయితే కబీర్ వయసు కేవలం 24 సంవత్సరాలయినట కానీ కృతి ఏజ్ మాత్రం 34 సంవత్సరాలు అన్నట్టుగా తెలుస్తోంది.

దాదాపుగా వీరిద్దరి మధ్య గ్యాప్ చూస్తే 10 ఏళ్ల తేడా ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే కబీర్ చాలా మంది క్రికెటర్ తో కూడా చాలా స్నేహంగానే ఉండే వారిని వార్తలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా ధోనీకి ,ధోని కుటుంబానికి కూడా మంచి సన్నిహితుడట. అంతేకాకుండా హార్దిక్ పాండ్యా, నటాషా పెళ్లికి కూడా కబీర్ హాజరయ్యారు. కృతి సనన్ కూడా గతంలో  కబీర్ చెయ్యి పట్టుకొని  లండన్ వీధుల్లో నడుస్తూ కనిపించిందట. ఈ ఫోటోలు కూడా వైరల్ గా మారడంతో కచ్చితంగా ఈ ముద్దుగుమ్మ ప్రేమలో ఉందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయం పైన కృతి సనన్ క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: