ఆ తేదీన "హరిహర వీరమల్లు" రిలీజ్..?

MADDIBOINA AJAY KUMAR
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మాణంలో చాలా రోజుల క్రితం హరిహర వీరమల్లు అనే ఫ్యాన్ ఇండియా మూవీ స్టార్ట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ స్టార్ట్ అయ్యి కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత పవన్ "భీమ్లా నాయక్" మూవీ:పై ఇంట్రెస్ట్ ను చూపించడంతో క్రిష్ "కొండపోలం" అనే మూవీ ని మొదలు పెట్టాడు.

ఇలా వీరిద్దరూ వేరే మూవీ లతో బిజీ కావడంతో హరిహర వీరమల్లు సైడ్ అయ్యింది. ఇక వీరిద్దరూ తమ తమ సినిమాలను కంప్లీట్ చేసుకుని మళ్లీ హరిహర వీరమల్లు ను మొదలు పెట్టారు. కానీ కొంత భాగం షూటింగ్ పూర్తి కాగానే ఈ సినిమా షూటింగ్ మళ్లీ ఆగిపోయింది. దీనితో ఈ సినిమా ఆగిపోయింది అని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క టీజర్ ను విడుదల చేసింది. దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ సినిమా నుండి దర్శకుడు క్రిష్ తప్పుకున్నట్లు తెలుస్తోంది.

దానితో ఈ మూవీ కి సంబంధించిన మిగల సన్నివేశాలను రూల్స్ రంజన్ మూవీ దర్శకుడు అయినటువంటి జ్యోతి కృష్ణ అనే దర్శకుడు దర్శకత్వం చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా టీజర్ విడుదలలో భాగంగా ఈ మూవీ ని ఈ సంవత్సరం విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం హరిహర వీరమల్లు మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ మూవీ యొక్క మొదటి భాగాన్ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: