రన్వీర్... ప్రశాంత్ వర్మ కాంబో మూవీకి క్రేజీ టైటిల్..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడుగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి ప్రశాంత్ వర్మ తన తదుపరి మూవీ ని హిందీ సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి రన్వీర్ సింగ్ తో చేయబోతున్నాడు. ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించబోతున్నారు. ఇప్పటికే ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు సంబంధించిన పూర్తి కథను రన్బీర్ కి వినిపించగా ... ఆ కథ అద్భుతంగా నచ్చడంతో వెంటనే ఈయన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మైత్రి నిర్మాణ సంస్థ లో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దానితో ప్రస్తుతం ప్రశాంత్ ఈ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్నట్లు తెలుస్తోంది.

ప్రీ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా ప్రశాంత్ ఇప్పటికే రన్వీర్ తో చేయబోయే సినిమాకు టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి ప్రస్తుతం ప్రశాంత్ "రాక్షస్" అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు దాదాపు ఇదే టైటిల్ ఈ సినిమాకు పెట్టే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమాలో రణ్వీర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు అందుకే ఈ సినిమాకు రాక్షస్ అనే టైటిల్ ను ఈ మూవీ మేకర్స్ పరిశీలిస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ప్రశాంత్ వర్మ , తేజ సజ్జ హీరోగా రూపొందిన హనుమాన్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత ఈయన జై హనుమాన్ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. కాకపోతే రన్వీర్ తో చేయబోయే సినిమా పూర్తి అయిన తర్వాతే జై హనుమాన్ మూవీ ని ప్రశాంత్ వర్మ మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

pv

సంబంధిత వార్తలు: