చనిపోతాననుకున్నా.. కానీ త్రుటిలో తప్పించుకున్నా : హీరోయిన్

praveen
నేటి సోషల్ మీడియా యుగంలో అన్ని ఈజీగా మారిపోయాయి. ఒకప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎక్కడో ఉన్న లైబ్రరీకి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏకంగా అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో వెతికితే చాలు కావాల్సిన దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. అలాగే ఇక కావాల్సిన మనుషులతో మాట్లాడాలి అన్న ఇక అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ఒక మార్గంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఒకప్పుడు సినీ సెలబ్రిటీలకు ప్రేక్షకులకు మధ్య కూడా చాలా దూరం ఉండేది. ఎక్కడో సెలబ్రిటీలు షూటింగ్లో పాల్గొంటే దూరం నుంచి చూసి ప్రేక్షకులు తెగ సంబరపడిపోయేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా కారణంగా ఆ దూరం పూర్తిగా తగ్గిపోయింది.

 దీంతో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు అటు తమ అభిమానులతో నేరుగా సోషల్ మీడియా మాట్లాడేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక అటు ప్రేక్షకులు కూడా తమకు కావాల్సిన ప్రశ్నలు అడుగుతూ ఆసక్తితో సమాధానాలు రాబట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే చాలామంది సినీ సెలబ్రిటీలు తమ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ప్రేమ పెళ్లి ఇలా అన్ని విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండటం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఇక అభిమానులతో పంచుకున్న విషయం మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏకంగా చావు అంచుల దాకా వెళ్లి వచ్చాను అంటూ షాకింగ్ విషయాన్ని చెప్పుకొచ్చింది హీరోయిన్.

 ఆమె ఎవరో కాదు సురభి.. విమాన ప్రమాదం బారిన పడ్డాను అంటూ తెలిపింది. చావు నుంచి తప్పించుకున్నాను అంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. నేను ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఫ్లైట్ కంట్రోల్ తప్పింది. ఇక ఆ విమానంలో ఉన్న అందరం సీట్లలో నుంచి కింద పడిపోయాం. ఇక నా గుండె జారిపోయినంత పని అయింది. కానీ కొన్ని గంటల తర్వాత పైలెట్ సురక్షితంగా విమానాన్ని లాండ్ చేశారు. నాకైతే చావు అంచులు దాకా వెళ్లి వచ్చినట్లు అనిపించింది అంటూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పుకొచ్చింది హీరోయిన్ సురభి. ఈ అమ్మడు  ఎక్స్ప్రెస్ రాజా, ఒక్క క్షణం లాంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: