మాట నిలబెట్టుకున్న పల్లవి ప్రశాంత్.. బిగ్ బాస్ ప్రైజ్ మనీ రైతులకు?

praveen
తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో గా పేరును సంపాదించుకుంది బిగ్ బాస్ షో  ఇక ఎన్నో ఏళ్ల నుంచి ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక గత ఏడాది బిగ్ బాస్ ఏడవ సీజన్ ముగిసింది. ఎవరు ఊహించనీ విధంగా కామన్ మ్యాన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు అన్న విషయం తెలిసిందే. మొదటినుంచి ఇక రైతుబిడ్డగా పేరు సంపాదించుకుని అదే ట్యాగ్ తో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాడు  అయితే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే తర్వాత ఇక పల్లవి ప్రశాంత్ విషయంలో ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 ఏకంగా పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్టు చేయడం.. జైల్లో పెట్టడం ఇదంతా సోషల్ మీడియాను ఊపేసింది అని చెప్పాలి. ఇదంతా పక్కన పెడితే ఇక బిగ్ బాస్ విన్నర్గా నిలిచిన పల్లవి ప్రశాంత్కు 35 లక్షల రూపాయలు ప్రైస్ మనీ దక్కింది. దీంతో పాటు ఒక కారు, డైమండ్ నెక్లెస్ కూడా గెలుచుకున్నాడు. అయితే ఇక తనకు వచ్చిన ఈ ప్రైజ్ మనీ మొత్తాన్ని కూడా రైతులకు పంచుతాను అంటూ హామీ ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. అయితే గ్రాండ్ ఫినాలే ముగిసి మూడు నెలలు దాటుతున్న ఇప్పటివరకు పల్లవి ప్రశాంత్ ప్రైజ్ మనీని రైతులకు పంచాడు అన్న విషయం తెర మీదికి రాలేదు. దీంతో మాట తప్పడు. ఇంకెప్పుడూ సహాయం చేస్తాడు అంటూ విమర్శలు కూడా వస్తున్నాయి.

 అయితే ఇలాంటి విమర్శలు అన్నింటినీ కూడా తరిమికొట్టే విధంగా ఇటీవలే పల్లవి ప్రశాంత్ ఒక పేద రైతు కుటుంబానికి అండగా నిలిచాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో గల కొలగూరు గ్రామానికి చెందిన రైతు కుటుంబానికి.. లక్ష రూపాయల సహాయం చేశాడు పల్లవి ప్రశాంత్. అతను ఒక పేద రైతు. అతని భార్య చనిపోవడంతో పిల్లలు అనాధలు అయ్యారు. ఇక వారి పిల్లల పేరు మీద ప్రశాంత్ లక్ష రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ చేయించాడు. అంతేకాకుండా పిల్లలకు ఏడాది సరిపడా బియ్యం కూడా అందజేశాడు. ఇక ప్రశాంత్ తో పాటు ఆట సందీప్ కూడా ఆ పిల్లలకు 25 వేల రూపాయల సహాయం చేశాడు. ఇక మిగతా మనీ కూడా పేదల కోసం పంచుతానని సహాయం చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పెడతాను అంటూ ప్రశాంత్ ఇంస్టాగ్రామ్ లో తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: