మెగా డాటర్ నిహారిక ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!?

Anilkumar
మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పినవసరం లేదు. తన చదువు పూర్తయిన తర్వాత సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ .చిన్నప్పటినుండి సినీ ఇండస్ట్రీలో పెరగడంతో తనకి సినిమాలపై ఎక్కువ ఆసక్తి ఉండేది. అందుకే సినిమాలు చేయాలి అని చిన్నప్పటినుండి ఫిక్స్ అయింది. అలా మొదట టీవీ షో చేసింది. ఢీ జూనియర్ షో కి యాంకర్ గా చేసింది. కాగా ఈ షో కి నాగబాబు జడ్జ్ గా వ్యవహరించారు. తండ్రి సపోర్ట్ తో మొదట యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. సుమారు ఏడాది కంటే ఎక్కువగానే యాంకరింగ్

చేసిన నిహారిక తను మొదట అందుకున్న రెమ్యూనరేషన్ విషయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూ వెల్లడించింది. దీంతో నిహారిక చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఢీజూనియర్‌` షోకి తాను అందుకున్న మొదటి పారితోషికం 20వేలు అని తెలిపింది. ఎపిసోడ్‌కి 20కే ఇచ్చేవారని తెలిపింది. అప్పట్లో తాను పెద్దగా డిమాండ్‌ చేయలేదని, ఇచ్చినంత తీసుకున్నట్టు తెలిపింది. తనకు ఇచ్చింది తక్కువేం కాదని వేరే చెప్పక్కర్లేదు. నిహారిక 2015లో ఢీ జూనియర్‌ షో చేసింది. ఆ సమయంలో ఎపిసోడ్‌కి 20వేలు అంటూ తక్కువేం కాదు.

మంచిగానే దక్కిందని చెప్పొచ్చు. వెనకాల ఫాదర్‌ నాగబాబు ఉండటంతో ఆమెకి బాగానే వర్కౌట్‌ అయ్యిందట. అయితే వచ్చిన డబ్బుని జల్సాలకు ఖర్చు చేయలేదట. వాటి నాన్న నాగబాబుకి ఇచ్చిందట. ఆయన తన పేరుతో సేవ్‌ చేశాడని వెల్లడించింది. ఇక ఈ షో ద్వారా వచ్చిన డబ్బులతో సొంతంగా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించింది అందులో మొట్టమొదటగా ముద్దపప్పు ఆవకాయ అనే సిరీస్ ని నిర్మించి అందులో యా క్ట్ కూడా చేసింది ఈ సిరీస్ కి సోషల్ మీడియా ద్వారా మంచి ఆదరణ లభించడంతో ఆ తర్వాత అదే బ్యానర్లో నాన్నకు వచ్చి ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ డెడ్ పిక్సెల్ బండి వెబ్ సిరీస్ లను నిర్మించింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: