పిఠాపురం: పవన్ కళ్యాణ్ వరాల జల్లు.. ప్రజలు విశ్వసిస్తారా..?
జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజున షెడ్యూల్లోని మార్పులు చేసినట్లుగా తెలుస్తున్నది.. చివరి రోజున సభను జగన్ పులివెందులలో నిర్వహిస్తారని అందరూ అనుకున్నారు.. కానీ పిఠాపురంలో సభను ఏర్పాటు చేసి ప్రచారం ముగించాలని అక్కడ పార్టీ నేతలకు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పిఠాపురం లో పవన్ కళ్యాణ్ కు సైతం మద్దతు తెలుపుతూ ఉండడంతో కూటమిలో కొత్త జోష్ కనిపిస్తోంది.
దీంతోపాటు జగన్ ను టార్గెట్ చేస్తూ రకరకాల ప్రసార సభలలో పవన్ కళ్యాణ్ ప్రసంగాలు చేస్తూ ఉండడంతో కొంతమంది సపోర్ట్ చేయగా.. మరి కొంతమంది కూటమి అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పాలి కానీ ఇలా ప్రతిసారి ఇతర పార్టీలను విమర్శిస్తే.. రాబోయే రోజుల్లో కచ్చితంగా కూడా తమ పార్టీ పరిస్థితి కూడా అలానే అవుతుందంటూ తెలుపుతున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎన్ని వరాలు కురిపించినా అక్కడ ఎక్కువగా వంగా గీతా కే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరి జగన్ ఇచ్చిన హామీలను పిఠాపురం ప్రజలు విశ్వసిస్తారా లేదా అనే విషయం మరో కొద్ది రోజులలో తెలియనుంది.. గతంలో కూడా పవన్ కళ్యాణ్ , చంద్రబాబు విడుదల చేసిన 2014 మేనిఫెస్టో ను అమలు చేయకపోవడం వల్ల ఇప్పుడు ప్రజలు నమ్మడానికి కాస్త ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి.