ఆ ఇండస్ట్రీ హిట్ మూవీని వదులుకున్న శర్వానంద్..!?

Anilkumar
టాలీవుడ్  యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో శర్వానంద్ గురించి  మనందరికీ తెలిసిందే. దాదాపుగా 20 ఏళ్లకు పైగా సిని ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు ఈ హీరో. ప్రస్తుతం తన మ్యారేజ్ లైఫ్ ను కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. కాగా ఈ దంపతులకు తాజాగా ఒక కూతురు కూడా పుట్టింది. ఇక ఈ గుడ్ న్యూస్ ను తాజాగా తమ అభిమానులతో పంచుకొని చాలా సంతోషించారు ఈ దంపతులు. ఈ క్రమంలోనే సినిమాల పరంగా కూడా మళ్లీ పుంజుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు శర్వానంద్.

2003 నుండి సినీ ఇండస్ట్రీ లో కొనసాగుతున్న ఈ హీరో ఎక్కువగా కుటుంబం అంతా కలిసి చూసే సినిమాలనే చేయడానికి ఇష్టపడతాడు. దాంతోపాటు యూత్ అట్రాక్ట్ అయ్యేలా గా చాలా వరకు లవ్ స్టోరీ సినిమాలతో కూడా ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే శర్వానంద్ ఇండస్ట్రీ హిట్ సినిమాని వదులుకున్నాడు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సందీప్ రెడ్డి వంగ  దర్శకత్వంలో వచ్చిన 'అర్జున్ రెడ్డి'. ఈ చిత్రం అసలు మన శర్వా చేయాల్సిందేనంట. కానీ అప్పట్లో పలు కారణాలతో

 రి
జెక్ట్ చేయడంతో విజయ్ కి అవకాశం దక్కింది. కానీ అప్పుడే శర్వానంద్ ఈ సినిమా చేసి ఉంటే మాత్రం ఇప్పుడు రేంజ్ వేరేలా ఉండేదని... ఇండస్ట్రీలో లెక్కలన్నీ మార్చేవాడని అంటున్నారు. చివరిగా 'ఆడవాళ్లు మీకు జోహార్లు', 'ఓకే ఒక జీవితం' వంటి చిత్రాలతో అలరించారు. ప్రస్తుతం శర్వా35లో నటిస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.  ఇక శర్వానంద్ లేటెస్ట్ సినిమాల విషయానికి వస్తే తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తో  సినిమా చేస్తున్నాడు. కాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను ఇంకా ఫిక్స్ చేయలేదు. శర్వా 35వ సినిమాగా ఈ సినిమా రాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: