రెమ్యునరేషన్ పెంచడంపై షాకింగ్ కామెంట్స్ చేసిన సుహాస్..!?

Anilkumar
టాలీవుడ్ హీరో సుహాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మధ్యకాలంలో వరుస సినిమాలు చేస్తూ భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటున్నాడు. అలా ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. ఇటీవల అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు. కాగా ఈ సినిమా ఊహించని స్థాయిలో భారీ విజయాన్ని అందుకుంది. థియేటర్స్ లో మాత్రమే కాకుండా ఇప్పుడు ఓటీటీ లో విడుదలైన ఈ సినిమా ఓటీటి లో సైతం దూసుకుపోతోంది. కాగా ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ హీరో.

 ఈ క్రమంలో సుహాస్  కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.. అదేంటంటే.. తాజాగా తాను రెమ్యూనరేషన్ పెంచిన విషయం పై కాస్త ఘాటుగా స్పందించాడు.. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. సుహాస్ ప్రస్తుతం ప్రసన్న వదనం సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.. ఈ సందర్బంగా టీజర్ లాంచ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు.. ఈ సందర్బంగా హీరో సుహాస్ మీడియాతో మాట్లాడాడు.. మీడియా వారు అడిగిన ప్రశ్నలకు స్టైయిట్ గాసమాధానం చెప్పారు సుహాస్.

యితే ఒక విలేకరి ప్రశ్నిస్తూ.. తన రెమ్యునరేషన్ గురించి ప్రశ్నించారు.. దానికి సమాధానమిస్తూ.. అవును పెంచాను నేను బ్రతకాలి కదా అంటూ ఘాటు రిప్లై ఇచ్చాడు.. జూనియర్ ఆర్టిస్ట్ గా రోజుకు 100 రూపాయలు తీసుకునే దగ్గర్నుంచి ఇప్పుడు హీరోగా కష్టపడి ఎదిగాను, ప్రతీ మెట్టులో నా కష్టం దాగి ఉంది. అలాంటిప్పుడు రెమ్యునరేషన్ పెంచడంలో తప్పులేదు అని అన్నారు.. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడుగు పెట్టిన సుహాస్. తన ఆటీట్యూడ్ తో, యాక్టింగ్ తో కట్టిపడేస్తున్నాడు. హీరోగా వచ్చిన ఒక్క అవకాశాలన్ని కరెక్ట్ గా ఉపమోగించుకున్న సుహాస్.. అంచలంచెలుగా ఎదుగుతున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: