ఈటీవీ విన్ ఓటిటి లోకి ఎంట్రీ ఇచ్చిన రెండు కొత్త సినిమాలు..!

MADDIBOINA AJAY KUMAR
కరోనాకు ముందు మన దేశంలో ఎక్కువ శాతం ఓ టి టి కంటెంట్ ను ప్రేక్షకులు ఆస్వాదించేవారు కాదు. ఎక్కువ శాతం థియేటర్స్ , టీవీలోనే సినిమాలను చూడడానికి ఇష్టపడేవారు. కానీ ఎప్పుడూ అయితే దేశంలోకి కరోనా ఎంటర్ అయిందో సినిమా హాల్స్ మూతపడ్డాయి , టీవీల్లో కూడా కొత్త కంటెంట్ కరువు అయింది. దానితో అప్పటివరకు ఓ టి టి లో చూడని కంటెంట్ పై జనాలు అంతా పడ్డారు. దానితో అలా ఓ టి టి ప్లాట్ ఫామ్ లకి అలవాటుపడ్డారు. దానితో కరోనా తర్వాత నుండి అనేక ఓ టి టి సంస్థలు పుట్టుకొచ్చాయి.

అందులో కొన్ని మంచి సక్సెస్ ను కూడా అందుకున్నాయి. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈటీవీ సంస్థ వారు ఈ టీవీ విన్ పేరుతో ఓ ఓ టి టి ప్లాట్ ఫామ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ప్రస్తుతం వీరు ప్రతి వారం అనేక కొత్త కంటెంట్ ను తమ ఫ్లాట్ ఫామ్ లోకి తీసుకు వస్తూ జనాలను ఆకర్షిస్తున్నారు. అందులో భాగంగా మీరు ఈ వారం కూడా రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ వారం ఈటీవీ విన్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి వరుణ్ సందేశ్ హీరో గా రూపొందిన చిత్రం చూడరా మరియు పార్ధు మూవీ లు ఎంట్రీ ఇచ్చాయి.

చిత్రం చూడరా మూవీ నుండి వరుణ్ సందేశ్ , ధనరాజ్ మరియు కాశీ విశ్వనాథ్ పోలీస్ స్టేషన్‌లో కూర్చున్నట్లు చూపించే ఫస్ట్ లుక్ పోస్టర్‌ ను మేకర్స్ ఇటీవల విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. శీతల్ భట్ , రవిబాబుక్, తనికెళ్ల భరణి , రాజా రవీంద్ర కీలక పాత్రల్లో ఈ మూవీ లో కనిపించనున్నారు. ఆర్ ఎన్ హర్షవర్ధన్ రచయిత మరియు దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు. ఇక పార్ధు మూవీ కి సంబంధించి పెద్దగా వివరాలను ఏవి మేకర్స్ విడుదల చేయలేదు. మరి ఈ రెండు మూవీ లు ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs

సంబంధిత వార్తలు: