అది కానీ జరక్కపోతే నా పేరు మార్చుకుంటా అని అన్నాను... అల్లు అర్జున్..!

MADDIBOINA AJAY KUMAR
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం టాప్ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న ఈయన దర్శకేంద్రుడు కే రాఘవేందర్రావు దర్శకత్వంలో రూపొందిన గంగోత్రి మూవీ తో హీరో గా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ కమర్షియల్ గా అల్లు అర్జున్ కు విజయాన్ని అందించిన ఆయన మాత్రం ఈ సినిమా విజయంతో అంతగా సంతృప్తి చెందలేదు. ఈ విషయాన్ని ఈయన కూడా అనేక సార్లు చెప్పుకొచ్చాడు.

ఇక ఒక అద్భుతమైన కమర్షియల్ విజయంతో పాటు తనకు సూపర్ గుర్తింపు తెచ్చే కథ కోసం వెతుకుతున్న సమయం లోనే ఆర్య మూవీ కథ తన దగ్గరకు వచ్చినట్లు ఆ స్టోరీ సూపర్ గా నచ్చడంతో ఆర్య మూవీ ని చేసినట్లు కూడా పలు సందర్భాలలో అల్లు అర్జున్ చెప్పాడు. ఇక ఆర్య సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించి ఆయన అనుకున్న ఈమేజ్ ను అల్లు అర్జున్ కు తీసుకువచ్చింది. ఇక ఈ సినిమా విడుదల అయ్యి 2024 మే 7 వ తేదీతో 20 ఏళ్లు పూర్తి అయింది. దానితో ఈ మూవీ బృందం వారు ఓ ఈవెంట్ ను నిర్వహించారు.

అందులో అల్లు అర్జున్ మాట్లాడుతూ ... ఆర్య మూవీ విడుదల అయింది. అన్ని ఏరియాల నుండి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. కాకపోతే ఈ సినిమా పది వారాలు మించి ఆడదు అని చాలా రిపోర్ట్స్ వచ్చాయి. మా నాన్న గారు కూడా ఈ సినిమా పది వారాల నుంచి ఆడదు అని చెప్పారు. కానీ ఆ సమయంలో నేను అన్నాను. ఈ సినిమా 125 రోజులు కచ్చితంగా ఆడుతుంది. ఈ మూవీ 125 డేస్ షీల్డ్ తీసుకోకపోతే నా పేరు మార్చుకుంటాను అని ఆ రోజు మా నాన్న గారితో చెప్పాను. చెప్పినట్లే జరిగింది. ఈ సినిమా 125 రోజులు ఆడింది. ఆ తర్వాత చిరంజీవి గారి చేతుల మీదగా 125 డేస్ షీల్డ్ తీసుకున్నాను అని అల్లు అర్జున్ తాజాగా చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ "పుష్ప పార్ట్ 2" మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: