ఎట్టకేలకు అటువంటి రూమర్స్ పై స్పందించిన నివేదా పేతురాజ్..!

Anilkumar
నివేదా పేతురాజ్.. తెలుగు, తమిళ్ లో వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. తెలుగులో మెంటల్ మదిలో సినిమాతో పరిచయమై బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురంలో, పాగల్, రెడ్, దాస్ కా ధమ్కీ.. లాంటి హిట్ సినిమాలతో ప్రేక్షకులని మేపించింది. నివేదా పేతురాజ్ నటి మాత్రమే కాదు, రేసర్, బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. తమిళనాడు సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌‌.. నివేదా పేతురాజ్‌కి రూ.50 కోట్ల విలువైన బంగ్లాని బహుమతిగా ఇచ్చాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా సీఎం కుమారుడిని నివేదా పేతురాజ్ డబ్బుల విషయంలో బాగా వాడేస్తుందంటూ ఇష్టమొచ్చినట్లుగా 

యూట్యూబ్ ఛానల్స్ వేసేశాయి. వీటిపైనే సీరియస్ కామెంట్స్ చేసింది నివేదా పేతురాజ్. తాజాగా నివేదా పేతురాజ్  తన గురించి వస్తున్న రూమర్స్ పై రియాక్ట్ అయ్యింది నివేదా. ఏదైన రాసేముందు దయచేసి నిజానిజాలు ఏంటో తెలుసుకోవాలని.. ఇప్పటికే తమ కుటుంబం ఒత్తడికి లోనవుతున్నామని.. ఒక అమ్మాయి జీవితంపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని కోరింది నివేదా పేతురాజ్ .  ''కొందరు నాపై సత్యదూర ఆరోపణలు చేస్తున్నారు. నాకు డబ్బులు ఇచ్చారని, ఇల్లు కొనుక్కున్నానని అంటున్నారు. ఓ అమ్మాయిపై ఇలా నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం. ఇలా మాట్లాడేటప్పుడు ఆమె జీవితం ఏమవుతుందనే

 విషయాన్ని కాస్త ఆలోచించాలి. నేను ఉన్నతమైన, గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చా.. ఆర్థిక స్వాతంత్రంతో 16వ ఏట నుంచి నేను స్వయంగా సంపాదించుకొని బ్రతకగలుగుతున్న. మా ఫ్యామిలీ దుబాయ్‌లో జీవిస్తున్నారు. ఇప్పటికీ అక్కడే ఉన్నాం.  నేను సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ ఏ నిర్మాతను, డైరెక్టర్ ను, హీరోను అవకాశాలు ఇవ్వమని అడగలేదు. ఇప్పటివరకు 20 సినిమాల్లో నటించా అవి నా టాలెంట్‌ను గుర్తించి వచ్చిన అవకాశాలే..  ఇలాంటి పరిస్థితుల నడుమ నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు'' అని పేర్కొన్నారు నివేదా పేతురాజ్ .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: