హీరో సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విభిన్న రకాల సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఇక తాజాగా వివి గోపాలకృష్ణ దర్శకత్వంలో రూపొందిన కృష్ణమ్మ సినిమాలో సత్యదేవ్ హీరోగా నటిస్తుండగా అతనికి జోడీగా అతీరా రాజ్ హీరోయిన్ గా నటించింది. మే 10న విడుదల కాబోతున్న కృష్ణమ్మ మూవీ ప్రమోషన్ లో భాగంగా సత్యదేవ్ మీడియా ముందుకు వచ్చాడు. కృష్ణమ్మ సినిమా పై చాలా నమ్మకం వ్యక్తం చేసిన సత్యదేవ్ తన భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాలా మంది కూడా కోహ్లీ ఇంకా రోహిత్ శర్మ వంటి వారి బయోపిక్స్ లో నటించాలని అనుకుంటారు. కానీ నేను మాత్రం అంబటి రాయుడు బయోపిక్ ని చేయాలి అనుకుంటాను.ఆయన బయోపిక్ కు నేను ఎంత వరకు సెట్ అవుతానో నాకు తెలియదు. కానీ నాకు ఆయన అంటే ఎంతో అభిమానం. ఎందుకంటే ఆయన కెరీర్ లో చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అందుకే ఆయన బయోపిక్ చేయడం అనేది నేను గౌరవంగా భావిస్తాను అని అన్నాడు.
ఇక సత్య దేవ్ కి కమల్ హాసన్ నటించిన నాయగన్, చిరంజీవి నటించిన ఆపద్బాంధవుడు, ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలు అంటే చాలా ఇష్టమని చెప్పాడు. అలాంటి ప్రత్యేకమైన సినిమాల్లో పాత్రల్లో నటించాలి అనేది నా డ్రీమ్ అని అన్నాడు. హీరోగా ఒక వైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇంకా అలాగే విలన్ గా సినిమాల్లో నటించడం పై స్పందిస్తూ నా అవసరం ఉంది అనుకున్న ప్రతి సినిమాలో నేను నటిస్తానని అన్నారు. నా నుంచి ప్రేక్షకులు ఆశించేది, దర్శకులు ఆశించేది ఇవ్వడమే నా లక్ష్యం అని అన్నాడు. ఇక మొత్తానికి సత్యదేవ్ డ్రీమ్స్ అనేవి చాలా పెద్దగా ఉన్నాయి. ముందు ముందు ఆయన సినిమాలు ఆ స్థాయిలో ఉండాలని ఆయన ఫ్యాన్స్ ఇంకా అలాగే సన్నిహితులు కూడా కోరుకుంటున్నారు. విలక్షణ పాత్రలు పోషిస్తూ, విభిన్నమైన సినిమాలను చేస్తున్న సత్యదేవ్ కు 'కృష్ణమ్మ' సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది అనేది చూడాలి. కాగా ఈ సినిమాకి పోటీగా నారా రోహిత్ నటించిన ప్రతినిధి 2 సినిమా వస్తుంది. ఇక ఈ రెండు సినిమాలు జనాలని ఏ విధంగా ఆకట్టుకుంటాయో చూడాలి.