ఆర్జీవి మూవీ నీ దొంగలించిన పూరిజగన్నాథ్...!!
ఇక ఈ సినిమా తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో మరొక సినిమా ఎప్పుడు వస్తుంది అంటూ అభిమానులు విపరీతంగా ఎదురుచూశారు. అలాంటి సమయంలోనే బిజినెస్ మెన్ సినిమాతో పూరి మహేష్ బాబుకు మరొక సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ ని అందించాడు. ఈ సినిమాతో మహేష్ బాబు ఖాతాలో మరో 50 కోట్ల వసూళ్లను రాబట్టిన సినిమా చేరిపోయింది. అయితే ఈ సినిమా కథ పూరి జగన్నాథ్ గారిది కాదు అనే విషయాన్ని పూరినే స్వయంగా చెప్పాడు. ఒకరోజు వాళ్ల గురువు అయిన రామ్ గోపాల్ వర్మ పూరీకి ఫోన్ చేసి ముంబై లో డాన్ లు ఎవరూ లేరు.ఇప్పుడు హీరో డాన్ అవుదామని ముంబై కి ఎంటర్ అయితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ మీద ఒక కథ రాయమని చెప్పాడట. దాంతో పూరి బిజినెస్ మెన్ అనే కథ రాసుకొని మహేష్ బాబు తో ఈ సినిమా చేశాడు. ఇక ఈ విషయాన్ని రాంగోపాల్ వర్మ కి చెప్పి నేను మహేష్ బాబు తో ఈ సినిమా చేస్తున్నానని చెబితే, అప్పుడు వర్మ ఇది నువ్వు డెవలప్ చేసిన కథ నా నుంచి లాక్కొని అయిన సినిమా చేసేంత హక్కు నీకు ఉంది అని నవ్వుతూ చెప్పాడట…