సినిమా టైటిల్ మార్చుకో.. మెగా హీరోకు పోలీసుల వార్నింగ్?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో బడా ఫ్యామిలీలుగా కొనసాగుతున్న వాటిలో మెగా ఫ్యామిలీ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఏ ఫ్యామిలీ నుంచి రానంతగా మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ కి కాస్త ఎక్కువ మంది హీరోలుగా పరిచయమయ్యారు. ఏకంగా అరడజనుకు పైగా హీరోలు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి రాణిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన హీరోలలో సాయి ధరంతేజ్ కూడా ఒకరు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే తన నటనతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఏకంగా తెలుగు ప్రేక్షకులందరికీ సుప్రీం హీరోగా కూడా మారిపోయాడు సాయి ధరంతేజ్.

 అయితే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. విరుపాక్ష అనే సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ మెగా హీరో ఇక ఇప్పుడు గాంజా శంకర్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నాడు. అయితే ఈ మెగా హీరోకి ఇప్పుడు ఏకంగా పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అయితే పోలీసులు ఇలా వార్నింగ్ ఇవ్వడానికి వెనక సాయి ధరంతేజ్ సినిమా టైటిల్ కారణం అని చెప్పాలి. వెంటనే సినిమా టైటిల్ని మార్చాలి అంటూ టీఎస్ న్యాబ్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా గాంజా శంకర్ సినిమా తెరకెక్కుతుంది.

 అయితే గాంజా శంకర్ అనే టైటిల్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు న్యాబ్ పోలీసులు   సాయి ధరమ్ తేజ్  మూవీ టైటిల్ యువతను తప్పుదోవ పట్టించేలా ఉంది అంటూ పోలీసులు అభిప్రాయపడ్డారు. వెంటనే టైటిల్ లో మార్చాలి అంటూ ఆదేశించారు. ఇక సినిమా ఆర్టిస్టులు ఇతర సెలబ్రిటీలు సామాజిక బాధ్యతతో నడుచుకోవాలి అంటూ ఇక ఒక నోటీసును కూడా విడుదల చేశారు. ఇక పోలీసులు నోటీసులు పంపించిన నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ సినిమా టైటిల్ లో మార్పులు జరిగే అవకాశం ఉంది అన్నది తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: