బిగ్ బాస్ ఓ కర్మ.. అమర్ దీప్ భార్య షాకింగ్ కామెంట్స్?

praveen
కన్నడ నుంచి తెలుగుకు వచ్చి ఇక్కడ సీరియల్స్ లో నటించి ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటిమణులు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో తేజస్విని గౌడ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. ఎన్నో సీరియల్స్ లో నటించి ఆమె తెలుగు ప్రేక్షకులందరికీ కూడా దగ్గరయ్యారు. కోయిలమ్మ సీరియల్ చేస్తున్న సమయంలోనే సీరియల్ నటుడు అమర్ దీప్ ప్రేమలో పడింది తేజస్విని గౌడ. ఇక వీరి ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్ళింది అన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం బుల్లితెరపై క్యూట్ కపుల్స్ గా వీరి జంట గుర్తింపును సంపాదించుకుంది.

 అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు తేజస్విని గౌడ. ఇక వీరి ప్రేమ వ్యవహారం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కోయిలమ్మ సీరియల్ చేస్తున్న సమయంలోనే అమర్ తనకు ప్రపోజ్ చేశాడు అంటూ చెప్పుకొచ్చింది. అయితే నేను అమర్ ప్రేమను మొదట రిజెక్ట్ చేశాను. ఇలా మూడు సంవత్సరాల పాటు అమర్ నా వెంటా పిచ్చోడిలా తిరిగాడు. అయితే మూడేళ్ల తర్వాత మరోసారి ప్రపోజ్ చేస్తే నేను వచ్చి మా ఇంట్లో వాళ్లతో మాట్లాడు.. వాళ్ళు ఒప్పుకుంటే నేను ఓకే లేదంటే ఇక్కడితో మర్చిపోయా అని చెప్పాను. ఇక అతను నేను చెప్పినట్లు ఫ్యామిలీతో వచ్చి మా ఇంట్లో వాళ్ళని అడిగితే  పెళ్లికి ఒప్పుకున్నారు అంటూ చెప్పుకోచ్చింది. అదే సమయంలో ఇక బిగ్ బాస్ హౌస్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది అమర్.

 అమర్దీప్ బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు నరకం అనుభవించాను అంటూ తేజస్విని గౌడ చెప్పుకొచ్చింది. అమర్ హౌస్ లో ఏ విధంగా ఉన్నా కూడా తనపై బయట నెగటివ్ ప్రచారం చేసేవారు. ఇలా తన గురించి వస్తున్న నెగెటివిటీని చూసి ఎంతగానో బాధపడ్డాను. ఒక రకంగా నరకం అనుభవించాను. లైవ్ చూడాలంటే నాకు కూడా భయం వేసేది. బిగ్ బాస్ ఒక కర్మ అని.. ఎప్పుడెప్పుడు ఈ షో అయిపోతుంద అని తాను ఎదురు చూసాను. ఇకపై భవిష్యత్తులో ఎప్పుడూ కూడా బిగ్ బాస్ గురించి మాట్లాడను అంటూ తేజస్విని గౌడ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: