రవితేజ ఈగల్ సినిమాలో చివరి 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.. నిర్మాత..!?

Anilkumar
ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీంచి ఇచ్చిన మాస్ రాజా గా  కొనసాగుతున్న రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆయన నటించిన లేటెస్ట్ సినిమా ఈగల్ ఫిబ్రవరి 9న ఈ సినిమా విడుదలై థియేటర్స్ లోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా శరవేగంగా చేస్తున్నారు చిత్ర బృందం. ఈ నేపథ్యంలోనే సినిమా ఎప్పుడు ఎప్పుడు విడుదలవుతుందా అని మాస్ రాజా అభిమానులతో పాటు సినీ లవర్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 ఈ క్రమంలోనే సినిమాపై ఈ సినిమా నిర్మాత విశ్వప్రసాద్ మరింత ఆసక్తిని పెంచేశారు. ఈగల్' గురించి, మరీ ముఖ్యంగా క్లైమాక్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రవితేజ హీరోగా నటించిన 'ఈగల్' సినిమా.. ఈ సంక్రాంతికే థియేటర్లలోకి వచ్చేలా ప్లాన్ చేశారు. కానీ మహేశ్, వెంకటేశ్, నాగార్జున చిత్రాలు విడుదలకు సిద్ధం కావడంతో 'ఈగల్' పోటీ నుంచి తప్పుకొంది. తెలుగు నిర్మాతల మండలి సోలో డేట్ హామీ ఇవ్వడంతో ఫిబ్రవరి 9కి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే సినిమా క్లైమాక్స్ వేరే లెవల్ ఉండబోతుందని నిర్మాత విశ్వప్రసాద్ చెప్పుకొచ్చారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టారు.'ఈగల్' సినిమాలోని చివరి 40 నిమిషాలు ఎక్స్‌ప్లోజివ్‌గా ఉంటుందని, లోకేష్ కనగరాజ్ స్టైల్ ఆఫ్ క్లైమాక్స్ ఉంటుందని.. తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి క్లైమాక్స్ చూసి ఉండరని నిర్మాత విశ్వప్రసాద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈయన చెప్పినట్లు క్లైమాక్స్ ఉంటుందా లేదా అనేది మరో రెండు రోజుల్లో తెలిసిపోతుంది. అప్పటివరకు వెయిట్ అండ్ సీ.'ఈగల్' సినిమాలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ నటించారు. నవదీప్ కీలకపాత్ర పోషించాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: