'పొన్నియన్ సెల్వన్' నాకు అర్థం కాలేదు.. 'సలార్' నటి కామెంట్స్ వైరల్?

praveen
ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఒక నటి గురించి తెగ చర్చించుకుంటున్నారు. ఆమె ఎవరో కాదు నటి శ్రియ రెడ్డి. ఆమె ఇండస్ట్రీకి కొత్తేమీ కాదు. గతంలో  ఎన్నో సినిమాల్లో నటించింది. ఇక నెగిటివ్ పాత్రలు కూడా పోషించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే గతంలోఎన్ని సినిమాలు చేసినప్పటికీ అంతంత మాత్రంగానే గుర్తింపును సంపాదించుకుంది శ్రీయ రెడ్డి. కానీ ఇటీవల ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ మూవీతో మాత్రం ఏకంగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.

 ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ మూవీ ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ప్రభాస్ కు ఒక సాలిడ్ హిట్టు దక్కింది. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే సలార్ సినిమాలో ప్రతి పాత్ర కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఇక శ్రియా రెడ్డి రాధా రామ అనే ఒక పవర్ఫుల్ రోల్లో కనిపించింది అని చెప్పాలి. ఇక తన నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. అయితే సలార్ మూవీ తర్వాత వరుసగా అవకాశాలు కూడా అందుకుంటుంది శ్రియ రెడ్డి. ఇకపోతే ఇటీవలే మణిరత్నం దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పోనియన్ సెల్వన్ సినిమా పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

 ఇటీవలే సలార్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంది శ్రీయ రెడ్డి. ఈ క్రమంలోనే పొనియన్ సెల్వన్ సినిమా గురించి ప్రశ్న ఎదురవ్వగా ఆ సినిమా తనకు అర్థం కాలేదు అంటూ చెప్పుకొచ్చింది. సినిమా రెండు మూడు సార్లు చూసిన కూడా ఎంతో గందరగోళంగా అనిపించింది అంటూ శ్రియా రెడ్డి చేసిన కామెంట్స్ కాస్త సంచలనంగా మారిపోయాయి అని చెప్పాలి. ఈ సినిమాలో పాత్రలు కాస్త ఎక్కువగా ఉండటంతో తాను కన్ఫ్యూషన్ లో పడ్డాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే శ్రియ రెడ్డి కామెంట్స్ విన్న కొంతమంది ప్రేక్షకులు తాము కూడా పోనియన్ సెల్వన్ తో కన్ఫ్యూషన్ లో పడ్డామని.. సినిమా అర్థం కాలేదు అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: