అభిమాని చేసిన పనికి ఏడ్చేసిన తమన్నా....!!

murali krishna
టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో మిల్క్ బ్యూటీ తమన్నా కూడా ఒకరు. ప్రస్తుతం ఈ అమ్మడు సౌత్ సినిమాలతోపాటు బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా గడుపుతుంది.తెలుగులో చిరంజీవి సరసన 'భోలా శంకర్' లో నటిస్తోంది. ఇటీవల తమన్నా రెండు బాలీవుడ్ వెబ్ సిరీస్ ల్లో నటించింది. మరోవైపు ఈ బ్యూటీ బీటౌన్ స్టార్ విజయ్ వర్మతో రిలేషన్ షిప్ లో ఉంది. దీంతో ఈమె ఎక్కడికి వెళ్లినా అభిమానుల తాకిడి ఎక్కువవుతోంది.
అయితే రీసెంట్ గా తమన్నా ముంబయి విమానాశ్రయంలో కనిపించి సందడి చేశారు. మిల్క్ బ్యూటీని చూసేందుకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అక్కడకు చేరుకున్నారు. అంతేకాకుండా ఆమెతో సెల్పీ దిగేందుకు ఎగబడ్డారు. తమన్నా కూడా అభిమానులతో కాసేపు ముచ్చటించారు. ఆ సమయంలో ఓ మహిళా ఫ్యాన్ తమన్నా కాళ్లకు దండం పెట్టి.. పూలబొకేతోపాటు ఓ గ్రీటింగ్ కార్డును ఆమెకు ఇచ్చారు. దీంతోపాటు తన చేతిపై తమన్నా ముఖాన్ని పచ్చబొట్టు వేయించుకున్న బొమ్మను చూపించారు. ఈ టాటూ కింద 'లవ్ యూ తమన్నా' అని కూడా రాసి ఉంది. దీంతో ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైన మిల్క్ బ్యూటీ.. ఆమెను కౌగిలించుకొని థ్యాంక్యూ ఫర్ యువర్ లవ్ అంటూ కాసేపు కంటతడి పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
తమన్నా నటించిన "లస్ట్ స్టోరీస్ 2'' వెబ్ సిరీస్ రేపు అంటే జూలై 29 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో నీనా గుప్తా, కాజోల్, మృణాల్, విజయ్ వర్మ, కుముద్ మిశ్రా కీలకపాత్రల్లో నటించారు. ఇటీవల మిల్క్ బ్యూటీ నటించిన ''జీ కర్దా'' రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. అరుణిమా శర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత దినేశ్ విజన్ నిర్మించారు. ఆషిమ్ గులాటి, సుహైల్ నయ్యర్, హుస్సేన్ దలాల్, అన్య సింగ్ తదితరులు ఇతరపాత్రల్లో మెరిశారు. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: