జగన్ మాటలకు కన్నీరు పెట్టుకున్న షర్మిళ?

Purushottham Vinay
వైఎస్ ఫ్యామిలిని రాజకీయాలు ముక్కలుగా చేసి శత్రువులుగా. షర్మిలపై జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు రోజు రోజుకు బాగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ టీవీ చానల్ ఇంటర్యూలో కుటుంబంలో విబేధాలకు షర్మిల రాజకీయ కాంక్షే కారణం అన్నట్లుగా కామెంట్స్ చేశారు.దీనిపై షర్మిల మీడియా ముందు స్పందించారు. బాగా ఎమోషనల్ అయ్యారు. తన రాజకీయ కాంక్షే రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో విభేదాలకు కారణమని జగన్ మోహన్ రెడ్డి చెప్పారని.. ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఎవరని షర్మిల ప్రశ్నించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అరెస్టు అయిన టైంలో  19 ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు ఉపఎన్నికల్లో ప్రచారం చేయమని అడిగింది ఎవరని షర్మిల ప్రశ్నించారు. కష్టపడి పాదయాత్ర చేయమని అడిగింది మీరు కాదా అని షర్మిళ ప్రశ్నించారు. ఎప్పుడు అవసరం ఉంటే ఆ అవసరానికి సమైఖ్యాంధ్ర, బైబై బాబు క్యాంపెయిన్, తెలంగాణలో పాదయాత్ర చేపించింది మీరు కాదా అని తన అన్న జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. నిజంగా రాజకీయ కాంక్ష అనేది ఉంటే పాదయాత్ర చేసినప్పుడు జైల్లో ఉన్నారు. అప్పుడు వైసీపీని హస్తగతం చేసుకొని ఉంటే అడిగేదెవరని మండిపడ్డారు.పొందాలనుకున్న పదవి మొండిగానైనా పొందగలనని షర్మిళ క్లారిటీ ఇచ్చారు. అసలు వివేకా లాంటి ఎంతో మంది తనను ఎంపీగా చేయాలని అనుకున్నారు.


అలా మీ పార్టీలోనే చాలా మంది ఉన్నారని గుర్తు చేశారు. మీతో ఉన్నంత కాలం సీఎంగా అయ్యే దాకా నాకు అలాంటి ఆలోచన లేదని షర్మిళ స్పష్టం చేశారు. నేను కేవలం నా అన్న కోసం చేశాను. వైఎస్ సంక్షేమ పాలన తీసుకొస్తానని అంటే నమ్మానని చెప్పుకొచ్చారు. బైబిల్ ఒట్టేసి చెబుతున్నా. నాకు ఎలాంటి రాజకీయ కాంక్ష అనేది లేదు. మిమ్మల్ని ఎప్పుడు కూడా పదవులు అడగలేదు.. దీని గురించి బైబిల్ మీద ప్రమాణం చేస్తాను మీరు చేస్తారా అని షర్మిళ ఎమోషనల్ అయి కన్నీరు పెట్టారు. కుటుంబంలో తాను తప్ప ఎవరూ కూడా రాజకీయాల్లో ఉండకూడదన్న జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ పై షర్మిల స్పందించారు. అవినాష్ రెడ్డి బంధువు కాదా అని ఆమె ప్రశ్నించారు. కమలాపురంలో పోటీ చేస్తున్న రవీంధ్రనాథ్ రెడ్డి  కూడా చుట్టం కాదా అని ప్రశ్నించారు. పైగా తనపై నిందలు వేస్తున్నారని ఏదో ఆర్థిక సాయం, పనులు అడిగారని.. వాటిని ఇచ్చేందుకు జగన్ మోహన్ రెడ్డి నిరాకరించినందునే తాను బయటకు వచ్చినట్లుగా చెబుతున్నారని షర్మిళ మండిపడ్డారు. పైసా సహాయం అడిగినట్టు నిరూపించగలరా అని వైఎస్ జగన్ కు షర్మిల సవాల్ విసిరారు. రాజశేఖర్ కొడుకు అనే మాట మర్చిపోయారని విలువల్లేకుండా రాజకీయాలు చేస్తున్నారని షర్మిళ జగన్ ని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: