ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న అనంతరం వరుస చిత్రాలతో బిజీగా ఉంది.అయితే తాజాగా ఈమె నటించిన సినిమా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఇక సుధీర్ బాబుతో కలిసి నటించిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.అయితే ఈ సినిమాపై బోలేడన్ని ఆశలు పెట్టుకున్న కృతి బాగా నిరాశకు లోనైంది.ఇక ఈ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ఈ మూవీకి తొలిరోజే నెగెటివ్ టాక్ రావడంతో.. కలెక్షన్స్ పూర్తిగా పడిపోయాయి. అయితే ఈ సినిమా కంటే ముందు వచ్చిన రామ్ పోతినేతి 'ది వారియర్', నితిన్ 'మాచర్ల నియోజక వర్గం' సినిమాలు కూడా
పెద్దగా హిట్ కాలేదు.ఇదిలావుంటే తన పుట్టిన రోజు సందర్భంగా కృతిశెట్టి కీలక నిర్ణయం తీసుకుంది.అయితే కష్టాల్లో ఉన్న పేదవారికి సాయం చేసేందుకు ఓ స్వచ్ఛంద సంస్థను మొదలు పెట్టింది.ఇక 'నిష్న- ఫీడ్ ది నీడ్' పేరుతో ఎన్టీఓను ప్రారంభించింది.అంతేకాదు తన తల్లిదండ్రుల పేరు మీదుగా ఈ సంస్థను నెలకొల్పినట్లు వెల్లడించింది. ఇక ఈ విషయాన్ని కృతిశెట్టి తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ ద్వారా తెలిపింది.ఇకపోతే సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఏడాది అయిన సందర్భంగా ఎన్నో విషయాలు వెల్లడించింది కృతి. కెరీర్ తో పాటు వ్యక్తిగతంగానూ పలు విషయాలను తెలుసుకున్నట్లు తెలిపింది.
ఆమె కష్టాల్లో ఉన్నవారికి ఏదైనా సాయం చేయాలనే లక్ష్యంతోనే స్వచ్ఛంద సంస్థను స్థాపిస్తున్నట్లు తెలిపింది.అయితే అందరూ తమ సంస్థకు అండగా నిలవాలని కోరింది. ఇక తన బర్త్ డే సందర్భంగా అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.అయితే వారికి ప్రత్యేక చెప్పింది కృతజ్ఞతలు కృతి. ఇక ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు కూడా చేపట్టాలని పిలుపునిచ్చింది.అంతేకాదు ఈ ఎన్టీవో ద్వారా.. పేదలకు అవసరమైన నిత్యవసర సరుకులు, దుస్తులు, పరిశుభ్రత సామగ్రి అందించనున్నట్లు కృతి తెలిపింది.అయితే ఇబ్బందుల్లో ఉన్న ఉన్న పేదలు తమను సంప్రదిస్తే తమకు తోచిన సాయం చేస్తామని వెల్లడించింది.ఇక కృతి నిర్ణయం పట్ల సినీ ప్రముఖులు, నెటిజన్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆమెది ఎంతో గొప్ప మనసని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు..!!